ప్రసాదరావు అభినందన సభకు రాని కృష్ణదాస్, తమ్మినేని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రసాదరావు అభినందన సభకు రాని కృష్ణదాస్, తమ్మినేని..!
శ్రీకాకుళం జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు మొదటి నుంచీ ఉన్నాయ్. ధర్మాన సోదరుల మధ్యే సఖ్యత లేదు. తాజా మంత్రివర్గ విస్తరణతో నేతల మధ్య ఆ అంతరం ఇంకా పెరిగిందట. మంత్రిగా ప్రమాణం చేసి జిల్లాకు వచ్చిన ధర్మాన ప్రసాదరావు అభినందన సభకు అందరినీ రావాలని ఆహ్వానించారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల నేతలకు ధర్మాన కీలక అనుచరులు ఫోన్లు చేశారు. అయితే ఆ సమావేశానికి నరసన్నపేట.. ఆమదాలవలస నియోజకవర్గాల నాయకులు హాజరుకాలేదు. గత మూడేళ్లుగా పార్టీ.. ప్రభుత్వ పరంగా నిర్వహించిన ప్రతి చిన్న కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్.. స్పీకర్ తమ్మినేని సీతారామ్లు ప్రసాదరావు అభినందన సభకు రాలేదు. ఈ నాయకులు ఏవో కారణాలతో రాలేకపోయినా.. కనీసం వాళ్ల కుటుంబసభ్యులు.. అనుచరులను ఎందుకు పంపించలేదనేది ప్రశ్న.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
సీఎం జగన్ను.. మంత్రి ప్రసాదరావును కొందరు నాయకులు అభినందన సభలో ఆకాశానికి ఎత్తేశారు. తాజా మాజీ అయిన ధర్మాన కృష్ణదాస్ ఊసు సభలో ఎక్కడా.. ఎవరి మాటల్లోనూ లేదు. అంతేకాదు.. అన్న నిర్వహించిన రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని ప్రసాదరావు మాట్లాడటంతో నరసన్నపేట నేతలు నొచ్చుకున్నారట. ఈ సభకు ధర్మాన కృష్ణదాస్ అనుచరుడిగా ముద్రపడ్డ DCCB అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు వచ్చారు. వేదికపైకి పిలుస్తారేమోనని చాలాసేపు ఆయన కింద వెయిట్ చేశారు. కానీ.. ఎంతకూ పైకి పిలవకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు కరిమి. ఇక ఆమదాలవలసలో తమ్మినేని వ్యతిరేకవర్గం యాక్టివ్ అయ్యింది. సోషల్ మీడియాలో పోస్టింగ్లతో ఊదరగొడుతోంది. జిల్లాకు దశ దిశ లేని నాయకత్వం కాదు.. సత్తా కలిగిన నేత వచ్చారంటూ పోస్టింగ్లు పెడుతున్నారు. వీటిని చూసిన పార్టీ కేడర్లో మరో చర్చ జరుగుతోంది. రాజుగారి రెండో భార్య మంచిదన్న సామెతను గుర్తు చేసుకుంటున్నారట.
ఈ పరిణామాలను చూసిన పార్టీ వర్గాలు మాత్రం.. మంత్రివర్గంలో మార్పులు కొత్త సమస్యను తీసుకొచ్చాయని చెవులు కొరుక్కుంటున్నారు. వైసీపీ అధిష్ఠానం చెప్పినదానికి భిన్నంగా వెళ్తుండటం పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదట. దాంతో మా నాయకుల తీరు మారబోదని కామెంట్స్ చేస్తున్నారు. అంతర్గత విభేదాలు ఎప్పుడు సమసిపోతాయో వేచి చూడటంలోనే మూడేళ్లు గడిచిపోయింది. అలాగే వచ్చే రెండేళ్లు సాగిపోతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అధినేత జగన్ అంటే అభిమానం.. ప్రేమ చూపించే నేతలు.. అదే అధినేత ఎంపిక చేసుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావును లైట్ తీసుకుంటున్నారు. ఈ విభేదాలు రానున్న రోజుల్లో ఎలాంటి సిత్రాలకు వేదిక అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!