బాక్సింగ్ లోకం మరో మేటి స్టార్ను కోల్పోయింది. జర్మనీ స్టార్ బాక్సర్ ముసా యమక్ (38) గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. మునిచ్లో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే యమక్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆస్పత్రికి తరలించే లోపే అతడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఉగాండాకు చెందిన హమ్జా వండెరాతో జరుగుతున్న మ్యాచ్ సమయంలో మూడో రౌండ్కు ముందు రింగ్లోనే యమక్ కుప్పకూలాడు. IPL 2022: అరగంట ఆలస్యంగా ఫైనల్ మ్యాచ్.. ఎందుకంటే..? ఈ విషయాన్ని గమనించిన అక్కడి సిబ్బంది…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతోంది. అయితే నేడు ముంబాయి డీవై పాటిల్ స్టేడియం వేదికగా.. పంజాబ్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఎందుకంటే.. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్కు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటి…
ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే.. నేడు ముంబాయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా.. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును ఆర్సీబీ ముందు పెట్టారు. 60 పరుగుల…
ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్లో నువ్వా నేనా అనే విధంగా జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ సీజన్లో భాగంగా నేడు ఆసక్తికర పోరు జరుగుతోంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్ తలపడుతోంది. అయితే టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకోగా రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్కు దిగారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇరుజట్లు చెరో 6 మ్యాచ్లు ఆడి…
టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు. దానికి పేదవారు…ధనవంతులతో పని లేదు. పట్టుదల..కష్టపడే తత్వం ఉంటే చాలు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జూనియర్ మహిళల హాకీప్రపంచకప్లో అద్భుతంగా ఆడుతున్న ముంతాజ్ కథ అలాంటిదే. ఉత్తరప్రదేశ్కు చెందిన ముంతాజ్ది ఓ నిరుపేద కుటుంబం. ఆరుగురు అక్కా చెల్లెళ్లు..ఒక సోదరుడు. తండ్రి సంపాదన అంతంత మాత్రమే. కుటుంబం గడవటానికి తల్లి కైసర్ జహాన్ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతుంది. శుక్రవారం దక్షిణ కొరియాపై ముంతాజ్ విజృంభించి ఆడుతున్న సమయంలో ..ఇక్కడ క్నోలోని…
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు శుభవార్త అందింది. ఈ జట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో పలు కారణాలతో తొలి మ్యాచ్ ఆడలేదు. అయితే అతడు గురువారం నాడు జట్టుతో చేరిపోయాడు. దీంతో శుక్రవారం కోల్కతా నైట్రైడర్స్తో పంజాబ్ కింగ్స్ ఆడనున్న మ్యాచ్లో బెయిర్ స్టో ఆడనున్నట్లు జట్టు యాజమాన్యం ధ్రువీకరించింది. ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ పర్యటన సందర్భంగా బెయిర్ స్టో జట్టులో చేరడం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఐపీఎల్లో మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని…
నేడు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా కోల్కత్తా నైట్రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్ధమైంది. ఈ సీజన్ తొలిమ్యాచ్లోనే ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఈ మ్యాచ్లో ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించి కేకేఆర్ జోష్లో ఉండగా.. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో భారీ స్కోరు సాధించి కూడా పరాజయం పాలైన…
ఐపీఎల్ 15వ సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్రారంభించింది. పటిష్ట ముంబై ఇండియన్స్ జట్టును 4 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ముంబై ఇండియన్స్ విధించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఉఫ్ మని ఊదేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా లలిత్ యాదవ్ (48 నాటౌట్), అక్షర్ పటేల్ (38 నాటౌట్) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి ఢిల్లీ జట్టును గెలిపించారు. దీంతో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ బూడిద పాలైపోయింది. పృథ్వీ షా (38),…
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఖాతాలో మరో టైటిల్ చేరింది. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని పీవీ సింధు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో థాయ్లాండ్ క్రీడాకారిణి బుసానన్పై 21-16, 21-8 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. 49 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో పీవీ సింధు సంపూర్ణ ఆధిపత్యం చేలాయించింది. ఈ ఏడాది సింధు ఖాతాలో ఇది రెండో టైటిల్ విజయం. ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోదీ…
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు, టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023 ఐపీఎల్ సీజన్కు ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ విరాట్ కోహ్లీ వ్యవహరిస్తాడని వెల్లడించాడు. తనపై ఒత్తిడి తగ్గించుకునేందుకు ఈ సీజన్కు విరాట్ కోహ్లీ చిన్న బ్రేక్ మాత్రమే తీసుకున్నాడని అశ్విన్ అన్నాడు. దీంతో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు ఆర్సీబీ కొత్త కెప్టెన్గా డుప్లెసిస్ను ఎంపిక చేయడం మంచి పరిణామమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.…