Asia Cup 2022: నేటి నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ టోర్నీ ప్రారంభం కానుంది. నిజానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా అక్కడి ఆర్ధిక పరిస్థితుల కారణంగా యూఏఈకి షిఫ్ట్ చేశారు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. దీంతో అన్ని జట్లు టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఈ టోర్నీలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొత్తం ఆరు జట్లు.. 13 మ్యాచ్లు.. 16 రోజుల పాటు జరగనున్నాయి.…
BWF Championship 2022: జపాన్లోని టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్-2022లో పురుషుల డబుల్ క్వార్టర్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ జోడీ అదరగొట్టింది. క్వార్టర్ ఫైనల్లో జపాన్కు చెందిన యుగో కొబయాషి, టకురో హోకిని 24-22, 15-21, 21-14 తేడాతో చిరాగ్ శెట్టి-సాత్విక్ జోడీ ఓడించింది. జపాన్ వరల్డ్ నంబర్ 2 జోడీపై వీరిద్దరూ గెలుపొందడంతో భారత్కు పతకం ఖాయం చేశారు. ఇటీవల ఇంగ్లండ్లో జరిగిన…
BWF Championship 2022: వయసుతో ఆటకు సంబంధం లేదని మరోసారి రుజువైంది. ఇప్పటికే వయసు మళ్లిన వారు పలు క్రీడలలో రాణిస్తూ ఈ విషయాన్ని చాటిచెప్తున్నారు. తాజాగా ఓ మహిళ తన కుమారుడితో కలిసి చరిత్ర సృష్టించింది. టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ 2022లో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.ఇజ్రాయెల్కు చెందిన స్వెత్లానా అనే 64 ఏళ్ల మహిళ బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. BWF చరిత్రలో ఓ…
ICC Rankings: ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పులేకుండా టీమిండియా తన మూడో ర్యాంకును నిలబెట్టుకుంది. ఇటీవల జింబాబ్వేతో ముగిసిన మూడు వన్డేల సిరీస్ను క్వీన్స్వీప్ చేసిన భారత్ మరో మూడు రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకొని 111 పాయింట్లతో తమ ర్యాంకును మరింత పదిలం చేసుకుంది. మరోవైపు నెదర్లాండ్స్తో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన పాకిస్థాన్ సైతం ఒక పాయింట్ను పెంచుకుని 107 పాయింట్లతో నాలుగో స్థానంలో…
Shubman Gill: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలో సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కూడా కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా 22 ఏళ్ల వయసులోనే విదేశీ గడ్డపై బ్యాక్ టు బ్యాక్ వన్డే సిరీస్లలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన టీమిండియా ఏకైక క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన…
India Vs Zimbabwe: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో కూడా టీమిండియానే టాస్ గెలిచింది. ఈ సందర్భంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి ఫీల్డింగ్ తీసుకునేందుకే మొగ్గు చూపించాడు. తొలివన్డేలో కూడా టీమిండియా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా జింబాబ్వేను 189 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేశారు. అదే తరహాలో రెండో వన్డేలో కూడా తక్కువ పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేసేలా టీమిండియా ప్రణాళికలు రచించింది. ఇప్పటికే మూడు…
Anil Kumble: ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కోచ్గా మాజీ దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే వ్యవహరిస్తున్నాడు. అయితే వచ్చే ఐపీఎల్లో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్ షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సెప్టెంబర్తో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్తో ఉన్న మూడేళ్ల ఒప్పందం ముగియనుంది. మళ్లీ అతడితో ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు పంజాబ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కోచ్గా అతడి స్థానంలో మరో క్రికెటర్కు ఆ బాధ్యతలను అప్పగించనుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ కొత్త…
Asia Cup 2022: ఈనెల 27 నుంచి దుబాయ్ వేదికగా ఆసియాకప్ 2022 జరగనుంది. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక వంటి జట్లతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు మరో క్వాలిఫయర్ జట్టు కూడా పాల్గొంటాయి. ఈ ఏడాది జరగబోతున్న ఆసియాకప్ 15వది. అంటే 2018 వరకూ 14 టోర్నీలు జరిగాయి. మొదటిసారి ఆసియాకప్ 1984లో జరిగింది. 2016లో తొలిసారి ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరిగింది. అందులో ఇండియా విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2018లో చివరిసారి…
Team India Record: జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మేరకు టీమిండియా ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ను 10 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అప్పుడు భారత ఓపెనర్లు 197 పరుగుల టార్గెట్ను వికెట్ కోల్పోకుండా ఛేదించారు. ఇప్పుడు జింబాబ్వేపై 192 పరుగుల టార్గెట్ను కూడా వికెట్లేమీ కోల్పోకుండా ఛేజ్ చేసి గెలిపించారు.…
Team India: వచ్చే నాలుగేళ్ల పాటు టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. ఈ మేరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ)ను ప్రకటించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నాలుగేళ్లలో భారత్ భారీ స్థాయిలో మ్యాచ్లను ఆడబోతోంది. 2023, మే నుంచి 2027, ఏప్రిల్ మధ్య 38 టెస్టులు, 39 వన్డేలు, 61 టీ20లు ఆడనుంది. ఇవి కాకుండా ఐసీసీ ఈవెంట్లు అదనం. అంటే వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీలు…