మొన్న తమిళనాడు ఎన్నికల సమయంలో స్టార్ హీరో విజయ్ ఓటు వేయడానికి సైకిల్ మీద వెళ్ళడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయింది. తాజాగా అదే ఫీట్ ను ఇప్పుడు ప్రముఖ నటుడు సోనూసూద్ చేశాడు. అయితే దీనికి కారణం వేరు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ స్పాట్ కు పొద్దున్నే వెళ్ళాల్సి రావడంతో సోనూసూద్ సైకిల్ మీద వెళ్ళిపోయాడట. సైక్లింగ్ అంటే ఇష్టమైన సోనూ… పొద్దునపొద్దునే ఇటు వ్యాయామంతో పాటు అటు ప్రయాణం కూడా చేసేశాడన్న మాట!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు మరో అరుదైన గౌరవం లభించింది. పంజాబ్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ ను నియమించింది పంజాబ్ ప్రభుత్వం. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ట్వీట్ చేశారు. “నటుడు సోనూసూద్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయం ప్రకటించడం సంతోషంగా ఉంది. ఆయన సపోర్ట్ కు ధన్యవాదాలు. ప్రతి ఒక్క పంజాబీ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి.…