Supreme Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన “సిట్” పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.. గత ప్రభుత్వ అవినీతిపై ‘సిట్’ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటుపై ‘స్టే’ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.. హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా.. ఇప్పటికే వాదనలు విన్న జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ రోజు తీర్పు ఇచ్చింది.. ఈ సందర్భంగా హైకోర్టు…
Supreme Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.. గత ప్రభుత్వం (చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం) నిర్ణయాలపై దర్యాప్తు కోసం ‘సిట్’ ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్నేతృత్వంలోని ఏపీ సర్కార్.. అయితే, ‘సిట్’ ఏర్పాటును ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా సవాల్ చేయగా.. సిట్’పై స్టే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇక, హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది వైఎస్ జగన్…
Tspsc paper leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ వేగవంతం చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. తదుపరి దర్యాప్తు పురోగతిపై జూన్ 5లోగా నివేదిక ఇవ్వాలని సిట్ను ఆదేశించింది.
TSPSC : టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. తాజాగా సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్ లో సంచలన సృష్టించిన గ్యాంగ్ స్టర్ అతిత్ అహ్మద్ హత్య కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఏప్రిల్ 15న గ్యాంగ్స్టర్లు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్లను కాల్చి చంపిన క్రైమ్ సీన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ రోజు పునర్నిర్మించింది.
TSPSC Paper: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలి కోసం డీఏవో పరీక్ష పేపర్ను రూ.6 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం రోజుకో షాకింగ్ ఇన్ఫర్మేషన్ బయటికొస్తోంది. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ చైన్ లింక్ను ఛేదిస్తోంది సిట్. ఇన్నాళ్లూ ఉద్యోగుల చుట్టూ తిరిగిన కథ మొత్తం ఇప్పుడు పెద్ద తలకాయలను ప్రశ్నించే వరకూ వెళ్లింది. తాజాగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ స్టేట్మెంట్ రికార్డు చేసింది.
పేపర్ లిక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్కు సిట్ రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ఇచ్చిన సిట్ నోటీసులు తనకు రాలేదని, సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి మీడియా కథనాల ద్వారా తెలిసిందని చెప్పడంతో..నిన్న సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని తెలిపారు. అయితే సిట్ నోటీసులకు బండిసంజయ్ స్పందించారు.
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన సిట్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హాజరు అవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.