సింహాచలం దేవస్ధానం ట్రస్ట్ బోర్డు వివాదం ఇప్పట్లో చల్లారేటట్టు కనిపించడం లేదు. కోర్టు నిర్ణయానికి అనుగుణంగా అనువంశిక ధర్మకర్త, చైర్మన్గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు చేపట్టారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఆహ్వానితులుగా అధికారపార్టీకి అనుకూలమైన వ్యక్తులు నామినేట్ అయ్యారు. పాలకమండలి కూర్పు ప్రభుత్వ నిర్ణయాధికారమే అయినప్పటికీ.. అది కొలువుతీరిన తీరు చర్చగా మారింది. చైర్మన్గా అశోక్ గజపతిరాజుకు ఆహ్వానం లేకుండానే అధికారులు కథ నడిపించేశారు. ఈ అంశాన్ని అశోక్ సీరియస్గా తీసుకుని న్యాయ సలహా కోరడంతో…
విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సింహాచలం ఆలయంలో స్వామివారి చందనోత్సవంలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు తమిళిసై. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం లభించడం మహాభాగ్యం అన్నారు తమిళిసై. తొలిసారి చందనోత్సవంలో పాల్గొన్నాను. ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి పవర్ ఫుల్ గాడ్, ఆలయంలో అడుగు పెడితేనే వైబ్రేషన్స్ ఉన్నాయ్ అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళసై.కొండపై స్వామివారి చందనోత్సవంకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. సాయంత్రం వరకు…
ఏపీ దేవాదాయ శాఖలో డిప్యుటేషన్ పేరుతో రెవెన్యూ అధికారుల పెత్తనానికి బ్రేకులు పడనున్నాయ్. ప్రధాన ఆలయాలకు ఈవోలుగా డిప్యూటీ కలెక్టర్లను నియమించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకనుంది. నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నియమకాలపై సుదీర్ఘంగా న్యాయ వివాదం జరగ్గా చివరకు దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఊరట లభించింది. రాష్ట్రంలో 8 ప్రధాన ఆలయాలు దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. వీటిలో సింహాచలం, కాణిపాకం, ద్వారకా తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి ముఖ్యమైనవి. ఈ ఆలయాలకు వచ్చే భక్తుల…
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం. నేడు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం. నేడు సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి అలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5వరకు స్వామివారి దర్శనాలకు బ్రేక్. నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్నూలులో సీనియర్ కార్యకర్తలకు సన్మానం విశాఖలో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం. రైవాడ జలాశయం నీటికి రాయల్టీ చెల్లింపు…
ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ఉంటుంది. తమతోపాటు బంధుగణానికి ప్రత్యేక మర్యాదలను కోరుకుంటారు నాయకులు. గుళ్లూ.. గోపురాల్లో ఆ హంగామా మరీ ఎక్కువ. ఈ కోవలోనే ఓ మంత్రిగారి వియ్యంకుడు ఆలయానికి వెళ్లారు. అమాత్యుడికి దక్కే గౌరవమే తనకు లభిస్తుందని వియ్యంకుడు ఆశించారు. కానీ.. అలా జరగలేదు. దీంతో మినిస్టర్ పేషీనే కదిలింది. వియ్యంకుడికే అవమానమా.. అంటూ సిబ్బందిపై వేటు వేసింది. ఆ రగడేంటో లెట్స్ సిబ్బందిని అమరావతికి పిలిచి అక్షింతలు..! సింహాచలం ఆలయంలో ఈ మధ్య భక్తుల రద్దీ…
విజయనగరంలో బాబాయ్ వర్సెస్ అమ్మాయిలా రాజకీయం నడుస్తోంది. సంచయిత గజపతి పై వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్రమంత్రి ప్రస్తుత సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజు. సంచయిత గజపతిరాజుని ఇల్లీగల్ చైర్మన్ గా వ్యాఖ్యానించారు అశోక్ గజపతి. ఈరోజు జరిగిన సమావేశంలో 12 అంశాలకు గాను 11 అంశాలను ఆమోదించామని అశోక్ గజపతిరాజు తెలిపారు. ఒక అంశాన్ని పరిశీలించి చర్చించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆ సింహాద్రి అప్పన్నకు సేవ చేయాలని ఆయన కోరారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా…
దేవుడి సన్నిధిలో ఆరేళ్లపాటు ఆయనే సర్వాధికారి. ప్రభుత్వ పెద్దలతో స్నేహాలు.. రాజకీయ నాయకులతో పరిచయాలు.. చేతిలో అధికారం.. డోంట్ కేర్ అనే తత్వం. ఇంకే ముంది.. అంతా తానై చక్రం తిప్పారు. కాలం మారింది. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఇంతకీ అంతా ఆయనే చేశారా? ఆయన వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఈ తవ్వకాలన్నీ ఆ అదృశ్య శక్తి కోసమేనా? సింహాచలం భూముల రగడలో ప్రభుత్వ యాక్షన్ ఏంటి? సింహాచలం భూముల వ్యవహారం ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.…
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగించి… ఆ బాధ్యతల్ని సంచయిత గజపతిరాజుకు అప్పగించింది ఏపీ సర్కార్. అయితే, దీనిపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన సంచయిత నియామకానికి సంబంధించిన జీవోను కొట్టి వేసింది. దీంతో మాన్సాస్ ట్రస్ట్తో పాటు సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త బాధ్యతల్ని తిరిగి చేపట్టారు అశోక్ గజపతిరాజు. అయితే, ఈ వివాదానికి అక్కడితో తెరపడలేదు. విశాఖలో రాష్ట్ర…
మాన్సాస్ ట్రస్ట్, ఇతర విషయాల్లో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది… ఇక, మరోసారి అశోక్ గజపతిరాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సంచయిత గజపతిపై అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చాలా అనాగరికం… అలాంటి అనాగరికుడుని రాజుగా ఎలా గుర్తిస్తామన్న ఆయన.. కూలింగ్ గ్లాసులలో లోకాన్ని చూసే వాడు ప్రజా సమస్యలు ఎలా తెలుసు కుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుణ్యమా…
ధర్మకర్తగా ఆయనది అధికారం. వ్యవస్థను గాడిలో పెట్టే దిశలో ప్రభుత్వానిది అజమాయిషీ. ఈ రెండింటి మధ్య ఇప్పుడు సంఘర్షణ జరుగుతోంది. అధికారులు అడకత్తెరలో పడ్డారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకి కోపం అన్నట్టు నలిగిపోతున్నారు. ఇంతకీ ఆ వివాదం ఎక్కడిది? ఈ స్టోరీలో చూద్దాం. గత ఏడాది అనువంశిక ధర్మకర్త బాధ్యతల నుంచి అశోక్ తొలగింపు సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ్మస్వామి దేవస్థానం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయ వ్యవహారాలకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు…