సంచయితపై అశోక్ గజపతి వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరంలో బాబాయ్ వర్సెస్ అమ్మాయిలా రాజకీయం నడుస్తోంది. సంచయిత గజపతి పై వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్రమంత్రి ప్రస్తుత సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజు. సంచయిత గజపతిరాజుని ఇల్లీగల్ చైర్మన్ గా వ్యాఖ్యానించారు అశోక్ గజపతి. ఈరోజు జరిగిన సమావేశంలో 12 అంశాలకు గాను 11 అంశాలను ఆమోదించామని అశోక్ గజపతిరాజు తెలిపారు.
ఒక అంశాన్ని పరిశీలించి చర్చించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆ సింహాద్రి అప్పన్నకు సేవ చేయాలని ఆయన కోరారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా సంచయితను తొలగించి కోర్టు తిరిగి అశోక్ గజపతిరాజుని నియమించిన సంగతి తెలిసిందే.
Also Read
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆడపిల్లకు హక్కులు వస్తాయని కొందరు మంత్రులు కన్ఫ్యూజ్ అయ్యారు. రక్తం పంచుకు పుట్టిన పిల్లలకు ఆస్తి పంపకాల్లో విభేదాలు ఉండరాదని సమాన హక్కులు వుండాలని అప్పుడు అన్నగారు ఇచ్చారు . కానీ ట్రస్ట్ వేరు, ప్రైవేట్ ప్రాపర్టీ వేరు…ట్రస్టు ప్రభుత్వ ఆస్తుల అంటూ కొందరికి కన్ఫ్యూజ్ వస్తుంది. మాన్సాస్ ట్రస్టు విషయంలో భక్తులు దేవుడికి ఇచ్చింది అవుతుంది.ఇది ప్రభుత్వ ఆస్తి కాదు. గతంలో సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు ఈ విషయం చెప్పింది. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం ఒక రెగ్యులేటర్ గానే పనిచేస్తుంది….ఓనర్ కాదు.
ప్రభుత్వం పాత్ర ఏంటి అనేది స్పష్టంగా ఉంది . రాష్ట్రంలో ఆనవాయితీగా వున్న టెంపుల్స్ 230 వరకు ఉన్నాయి.కావాలంటే వాటికి ప్రభుత్వం ఫౌండర్ మెంబర్స్గా మొత్తం మహిళలకే ఇవ్వొచ్చు. సింహాచలం దేవస్థానం భూములను ఒక పాలసీ ప్రకారం ఇవ్వాలి అనేది నా అభిప్రాయం. నాకు ఎవరితోనూ వ్యక్తిగత కక్ష లేదు.అందరితో పని చేస్తా అన్నారు అశోక్ గజపతి. ధర్మకర్తగా నాకు అధికారులకు మధ్య భవిష్యత్తులో విభేదాలు రాకూడదన్నారు. మాన్సాస్ ఈవో ను నేను వెళ్ళి కలుస్తాను అపాయింట్మెంట్ ఇమ్మంటే ఆ పెద్దమనిషి నాకు టైమ్ ఇవ్వడంలేదు. ఈరోజు జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం ద్వారా గతంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేవి కొంతవరకు తెలిశాయి. రికార్డులలో కొన్ని తేడాలు ఉన్నాయి. భక్తులు సౌకర్యాలకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి.. దానిపై హోవర్క్ చేసి అన్ని కోణాల నుండి రిపోర్ట్స్ తెప్పించుకోవాలన్నారు.
పైడి తల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవానికి తనను ఆహ్వానించలేదని సంచయిత మంగళవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద బాబాయ్ వర్సెస్ అమ్మాయి కామెంట్లు రచ్చరేపుతున్నాయి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!