Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Land Grab Of Simhachalam

అప్పన్న సన్నిధిలో ఆరేళ్లపాటు సర్వాధికారిగా విధులు!

Published Date :July 24, 2021 , 8:37 pm
By Lakshmi Narayana
అప్పన్న సన్నిధిలో ఆరేళ్లపాటు సర్వాధికారిగా విధులు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేవుడి సన్నిధిలో ఆరేళ్లపాటు ఆయనే సర్వాధికారి. ప్రభుత్వ పెద్దలతో స్నేహాలు.. రాజకీయ నాయకులతో పరిచయాలు.. చేతిలో అధికారం.. డోంట్ కేర్ అనే తత్వం. ఇంకే ముంది.. అంతా తానై చక్రం తిప్పారు. కాలం మారింది. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఇంతకీ అంతా ఆయనే చేశారా? ఆయన వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఈ తవ్వకాలన్నీ ఆ అదృశ్య శక్తి కోసమేనా?

సింహాచలం భూముల రగడలో ప్రభుత్వ యాక్షన్‌ ఏంటి?

Also Read

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
  • Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
  • Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

సింహాచలం భూముల వ్యవహారం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి భూముల మాయం వెనక సూత్రధారులు, పాత్రధారులను గుర్తించి చర్యలకు సిద్ధమవుతోంది. ఈ దశలో దేవాదాయ శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన 108 పేజీల నివేదిక కీలకంగా మారనుంది. నివేదిక ప్రకారం.. దేవస్థానం ఆస్తుల జాబితా నుంచి గల్లంతైన భూమి.. 860 ఎకరాలు. ఈ స్థిరాస్తి మార్కెట్ విలువ సుమారు పదివేల కోట్లుగా ఓ అంచనా. విచారణ కమిటీ నివేదిక పరిశీలన తర్వాత ప్రభుత్వం యాక్షన్ ఎలా ఉంటుందనే ఉత్కంఠ దేవాదాయశాఖలో పెరుగుతోంది.

అందరి దృష్టీ అప్పటి ఈవో రామచంద్రమోహన్‌పైనే!

సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వివాదం తర్వాత ఆలయం ఆస్తులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సమయంలోనే ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి భూములు చేతులు మారిన విషయం వెలుగు చూసింది. దీంతో అందరి దృష్టి అప్పటి ఎగ్జిక్యూటివ్ అధికారి కోడూరి రామచంద్ర మోహన్ పై పడింది. ఆయన ఈవోగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అప్పన్న భూములను అన్యాక్రాంతం చేశారనేది అభియోగం. విచారణ కమిటీ తన నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను కమిటీ సమర్పించింది. నిబంధనల ప్రకారం ప్రాపర్టీ రిజిస్టర్లో భూములను డిలీట్ చేసే అధికారం ఈవోలకు ఉండదు. కేవలం ఎండో మెంట్ ట్రిబ్యునల్, దేవాదాయశాఖ కమిషనర్ మాత్రమే ఎన్. ఓ.సీలు జారీ చేసేందుకు చట్టం నిర్ధేశించింది.

2016లో రెండుసార్లు భూముల తొలగింపునకు ప్రతిపాదనలు

2016-17 కాలంలో సింహాచలం దేవస్థానం ఈవో హోదాలో రామచంద్ర మోహన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణ. ఈయన హయాంలోనే గుట్టు చప్పుడు కాకుండా కాగితాలు మారిపోయాయి. భూముల వివరాలు తారుమారైనట్టు విచారణ కమిటీ గుర్తించింది. విచారణ కమిటీ నివేదిక ప్రకారం.. 2016 సెప్టెంబర్ 19న, అక్టోబర్ 4న రెండుసార్లు భూముల తొలగింపునకు అప్పటి ఈవో ప్రతిపాదించారు. దేవాదాయశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అప్పటి అసిస్టెంట్ కమిషనర్ తిప్పి పంపించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో.. ముందు తిరస్కరించిన ప్రతిపాదనలకు ఉన్నతాధికారులు ఆమోద ముద్ర వేశారు.

ప్రైవేట్‌ వ్యక్తుల స్వాధీనంలోనే భూములు ఉన్నాయా?
రామచంద్రమోహన్‌ వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరు?

2017 ఏప్రిల్ 24న~భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి ఇచ్చినట్టు గుర్తించారు. రికార్డుల నుంచి తొలగించడానికి దారితీసిన పరిస్ధితులు, ఆనాటి ఒత్తిళ్లు, లబ్ధిపొందిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల కథంతా విచారణ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. అయితే ఆ భూములు అప్పుడు పొందిన ప్రైవేట్‌ వ్యక్తుల స్వాధీనంలోనే~ఉన్నాయా..? వేరే చేతులు మారాయా…?~ అన్నది కీలకంగా మారింది. ఈ మొత్తం కుంభకోణం ఒక్క రామచంద్రమోహన్‌ చేతులు మీదుగానే జరిగిందా? లేక ఆయన వెనక మరెవరైనా ఉన్నారా అన్నది కూపీ లాగుతున్నారు. రామచంద్రమోహన్‌ ఒక్కరే లబ్ధి పొంది.. ఇలా లేని అధికారంతో స్వామి వారి భూములను అన్యాక్రాంతం చేశారంటే నమ్మశక్యం కాదంటున్నారు. బలమైన రాజకీయ నేపథ్యం ఉంటే తప్ప ..ఆయన ఆ స్థాయి నిర్ణయాన్ని తీసుకుని ఉండరని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్‌ రామచంద్రమోహన్‌ వెనక ఉన్న ఆ అదృశ్య శక్తే. ఇప్పుడు ఆ అదృశ్య శక్తి పట్టే పనిలో ప్రభుత్వం ఉంది.

నాలుగు కేటగిరీలలోని భూములను తొలగించారా?
మాన్సాస్‌కు చెందిన 150 ఎకరాలను రూల్స్‌ ప్రకారం విక్రయించారా?

ఈ ఎపిసోడ్‌లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ముందు వరుసలో అప్పటి ఈవో కోడూరి రామచంద్ర మోహనే ఉంటారట. ముందు ఆయన్నను ఫిక్స్‌ చేస్తే తప్ప ఆయన వెనక ఉన్న వారు బయటకు లాగలేరు కాబట్టి అక్కడ నుంచే చర్యలు మొదలుపెట్టారు. రామచంద్రమోహన్‌ను ఇటీవల దేవాదాయశాఖ ప్రభుత్వానికి సరెండర్ చేసింది. ఇప్పుడు త్రిసభ్య కమిటీ నివేదికలో దీన్లో ఉన్న మరి కొన్ని పేర్లు ప్రస్తావించినట్టు సమాచారం. వాస్తవానికి ఆలయ ఆస్తుల జాబితా నుంచి నాలుగు కేటగిరీలలోని భూములను తొలగించినట్టు తేలింది. ఇనామ్ భూముల కేటగిరీలో తొలగించిన వాటిలో 21 సర్వే నెంబర్లకు సంబంధించి ‘మీ భూ’ పొర్టల్లో ఇప్పటికీ ఆలయం భూముల పేరుతోనే ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి అప్పటి ఈవో, దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినట్టు తేలింది. రామచంద్ర మోహన్ ఆరేళ్లు సింహాచలం ఈవో గా పని చేశారు. మాన్సాస్‌కు ఈవోగా ఉన్నారు. మాన్సాస్‌కు చెందిన 150 ఎకరాల విక్రయంలో నిబంధనల మేరకు నడుచుకున్న ఆయన సింహాచలం భూముల విషయంలో ఎందుకు రూల్స్‌కు విరుద్ధంగా చేశారన్నదే ప్రశ్న. ఆలయ ఈవోగా ఆయన హయాంలో అభివృద్ధి పనులు జరిగినప్పటికీ.. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన వ్యవహారాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. దీంతో చర్యలు ఎవరి మీద ఉంటాయి? ఎలా ఉంటాయనేది తేలాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • land grab of Simhachalam
  • off the record
  • Simhachalam

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions