Udupi College Case: ఉడిపి కాలేజీ కేసులో సిద్ధరామయ్యపై ట్వీట్.. బీజేపీ కార్యకర్తపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udupi College Case: ఉడిపి కాలేజీ కేసుకు సంబంధించి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై ట్వీట్ చేసినందుకు గానూ బీజేపీ కార్యకర్తపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది. ఉడిపిలోని ఓ ప్రైవేటు పారామెడికల్ కాలేజీ వాష్రూమ్లో ఒక విద్యార్థిని వీడియోలను మరో ముగ్గురు ముస్లిం విద్యార్థినులు నగ్నంగా చిత్రీకరించారనే ఆరోపణలపై కర్ణాటకలో బీజేపి భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. బీజేపీ కార్యకర్త శకుంతర కర్ణాటక కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్ చేసిన ట్వీట్ స్క్రీన్షాట్ను పంచుకున్నారు. అధికార పార్టీ ఈ సంఘటనను పిల్లల ఆట అని లేబుల్ చేసిందని ఆరోపించారు. తన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే తానేం చేసేవాడిని అంటూ సిద్ధరామయ్యపై ఆ కార్యకర్త వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉడిపిలో జరిగిన పిల్లల ఆట కేసును బీజేపీ రాజకీయం చేస్తోందని కర్ణాటక కాంగ్రెస్ గతంలో పేర్కొంది. హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో హనమంత్రయ్ అనే వ్యక్తి శకుంతలపై ఫిర్యాదు చేయగా, ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read: Girls Videos Row: కాలేజీ వాష్రూంలో నగ్న దృశ్యాల చిత్రీకరణ.. స్పందించిన జాతీయ మహిళా కమిషన్
Also Read
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
మహిళా వాష్రూమ్లలో విద్యార్థినులు స్నానం చేయడం లేదా టాయిలెట్లను రికార్డ్ చేయడానికి వీడియో కెమెరాలను ఉంచారని ఆరోపిస్తూ ముగ్గురు విద్యార్థులు — అలిమతుల్ షైఫా, షబానాజ్, అలియాలు ఉడిపిలోని మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ అయ్యారు. రష్మీ సమంత్ అనే కార్యకర్త ఈ సంఘటన గురించి ట్వీట్ చేయడంతో పాటు హిందూ అమ్మాయిలను నగ్న ఛాయాచిత్రాలతో బ్లాక్ మెయిల్ చేశారని చెప్పడంతో పోలీసులు ఈ కేసులో మతపరమైన కోణాన్ని ఖండించారు. తాను చేసిన ట్వీట్ను ఉద్దేశించి తనను భయపెట్టడానికి పోలీసులు తన ఇంటికి వచ్చారని బీజేపీ కార్యకర్త శకుంతల ఆరోపించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంస్థాగత పీడనకు వ్యతిరేకంగా నిలబడినందుకు హిందువులపై బెదిరింపులు, వేధింపులకు గురిచేస్తోందని బీజేపీ ఆరోపించింది.
ಮುಸ್ಲಿಂ ಯುವತಿಯರು ಟಾಯ್ಲೆಟ್ ನಲ್ಲಿ ಕ್ಯಾಮೆರಾ ಇಟ್ಟು ಹಿಂದೂ ಹೆಣ್ಣುಮಕ್ಕಳ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದು ಕಾಂಗ್ರೆಸ್ನವರ ಪ್ರಕಾರ ಮಕ್ಕಳಾಟವಂತೆ..@siddaramaiah ನವರ ಸೊಸೆ or ಹೆಂಡ್ತಿ ಅವ್ರ ವಿಡಿಯೋವನ್ನು ಇದೆ ತರ ಮಾಡಿದ್ರೆ
ಅದನ್ನು ಮಕ್ಕಳಾಟ ಅಂತ ಒಪ್ಕೋತೀರಾ? pic.twitter.com/jP0QTKvL5R— ಶಕುಂತಲ ನಟರಾಜ್ (@ShakunthalaHS) July 25, 2023
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!