Anna Bhagya Scheme: బియ్యంకు బదులు నగదు ఇవ్వనున్న కర్ణాటక సర్కారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anna Bhagya Scheme: కర్ణాటక ప్రభుత్వం పెద్ద మొత్తంలో బియ్యం కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, ‘అన్న భాగ్య’ పథకం కింద ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు 5 కిలోల అదనపు బియ్యం అందించడానికి బదులుగా కిలోకు రూ.34 చొప్పున నగదు ఇవ్వాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో అన్న భాగ్య పథకం కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం బియ్యాన్ని కొనుగోలు చేసేంత వరకు 5 కిలోల బియ్యానికి బదులు రూ.170 (కిలో రూ.34) డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
Also Read: Rain Alert: మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల ఇద్దరు మృతి.. గుజరాత్లో రెడ్ అలర్ట్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
రాష్ట్రంలో బియ్యాన్ని కొనుగోలు చేయగలిగిన వెంటనే బీపీఎల్, అంత్యోదయ కార్డుదారులకు డబ్బులకు బదులు బియ్యం పంపిణీ చేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన హామీ నుంచి వెనక్కి తగ్గకూడదనే ఉద్దేశంతో కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రజలకు సిద్ధరామయ్య తెలిపారు. పేదలకు అన్నం పెట్టే విషయంలో రాష్ట్రంలోని బీజేపీ కేంద్రంతో మాట్లాడి ఉండాల్సిందని.. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర ఆహార మంత్రులను కలిశానన్నారు. అయితే, జులై 1 నుంచి లబ్ధిదారులకు బియ్యం అందిస్తామని, రాష్ట్రానికి అవసరమైన డిమాండ్ను తీర్చేందుకు ప్రతి నెలా 2,29,000 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని సిద్ధరామయ్య అన్నారు. ఈ నెల ప్రారంభంలో, అవసరమైన బియ్యాన్ని సరఫరా చేయడానికి మొదట అంగీకరించిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ), తరువాత మార్కెట్ జోక్యానికి తగిన నిల్వలను నిర్వహించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ తన నిర్ణయాన్ని మార్చుకుంది.
తాజావార్తలు
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..