BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్లో కలవరం.. సీఎం సిద్ధరామయ్యపై సీనియర్ నేత మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BK Hariprasad: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి, ముఖ్యమంత్రి పదవులకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటకలోని అధికార పార్టీలో కలవరం మొదలైంది. కర్ణాటక మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) బీకే హరిప్రసాద్ శుక్రవారం ఈడిగ, బిల్లవ, నామ్ధారి, దేవర సంఘాల సమావేశంలో మాట్లాడారు. హరిప్రసాద్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యానించనప్పటికీ, ఆయన మంత్రివర్గ సహచరులు కొందరు ఎలా స్పందించాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు.
బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ.. “సమాజం స్పృహతో ఉండాలి. నేను మంత్రిని అవుతానా లేదా అనేది వేరే ప్రశ్న. ఈ దేశంలో పాండిచ్చేరి (పుదుచ్చేరి) లేదా గోవాలో ఐదుగురు ముఖ్యమంత్రులను చేయడంలో నేను ఇప్పటికే పాత్ర పోషించాను. జార్ఖండ్లో నేను ఒంటరిగా చేశాను. హర్యానా, పంజాబ్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బృందంతో కలిసి చేశాను” అని హరిప్రసాద్ అన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడైన భూపేష్ బఘేల్ను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని చేసిన ఘనత కూడా తనదేనని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
“కాబట్టి కొందరిని ముఖ్యమంత్రిని చేయడం ఎలాగో.. ఎవరైనా ఆ పదవి నుంచి దిగిపోయేలా చేయాలనేది నాకు బాగా తెలుసు.. నేను తలవంచను, అడుక్కోను. స్పష్టంగా చెబుతున్నాను. ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా. 49 ఏళ్లుగా బెంగళూరులో రాజకీయాలు చేయడం పిల్లల ఆట కాదు.” అని హరిప్రసాద్ అన్నారు. మేలో మంత్రివర్గ ఏర్పాటు సమయంలో, ముఖ్యమంత్రి హరిప్రసాద్ చేరికను తీవ్రంగా వ్యతిరేకించడంతో మంత్రి పదవి రేసులో హరిప్రసాద్ ఓడిపోయారని వార్తలు వచ్చాయి. మండలిలో మాజీ ప్రతిపక్ష నాయకుడు హరిప్రసాద్, సిద్ధరామయ్య ఇద్దరూ వరుసగా ఈడిగ, కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓబీసీలు.
Also Read: Defamation Case: రూ.2 కోట్లు చెల్లించాల్సిందే.. పరువు నష్టం కేసులో తరుణ్ తేజ్పాల్కు ఎదురుదెబ్బ
రాజకీయంగా ఎందుకు ముందుకు రాలేకపోతున్నారో ఈడిగ, బిల్లవ, నామ్ధారి, దేవర సంఘాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎవరి కుట్రలకు తాము బలిపశువులయ్యామని తెలుసుకోవాలని హరిప్రసాద్ అన్నారు. ఉడిపి జిల్లాలోని కర్కల వద్ద కోటి చెన్నయ్య థీమ్ పార్కు కోసం తాను కేవలం రూ.5 కోట్లు ఇవ్వాలని సిద్ధరామయ్యను కోరానని, దానికి సానుకూలంగా స్పందించారని, అయితే ఆ తర్వాత ఏమీ రాలేదని హరిప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈడిగ, బిల్లవ, నామ్ధారి, దీవరలు రాజకీయ అవకాశాలను కోల్పోతున్నారని, ఈ కులాల ఆధిపత్య స్థానాల్లో క్రిస్టియన్ లేదా ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తున్నారని హరిప్రసాద్ సూచించారు.
కాంగ్రెస్ నాయకుడి ప్రకటనపై అడగ్గా, మొదట తడబడినట్లు కనిపించిన హోంమంత్రి జి. పరమేశ్వర ఇలా అన్నారు: “ఆయన ఏ సందర్భంలో మాట్లాడారో నాకు తెలియదు. కొన్నిసార్లు, నాయకులు వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.” అని అన్నారు. మరో మంత్రి డి.సుధాకర్ మాట్లాడుతూ.. “ఆయన (హరిప్రసాద్) సీనియర్ నేత.. పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదు. వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకుని ఉండవచ్చు. (పార్టీ) హైకమాండ్ చూస్తుంది” అని అన్నారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?