Dengue cases: కర్ణాటకలో 7000కు పైగా డెంగ్యూ కేసులు.. చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dengue cases: కర్ణాటకలో పెరుగుతున్న డెంగ్యూ కేసుల దృష్ట్యా, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. డెంగ్యూ కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైందని.. ప్రజలు తమ ఇళ్ల చుట్టూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిద్ధరామయ్య కోరారు.
Read Also: ACB Court: చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ విచారణలో ట్విస్ట్..! తీర్పు రేపటికి వాయిదా..
Also Read
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. అయితే 4,000 కంటే ఎక్కువ బెంగళూరు నగరంలో నమోదయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.., డెంగ్యూ కేసుల పెరుగుదలపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో దోమల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టడంతోపాటు రసాయనాలు పిచికారీ చేయడం, నీరు పేరుకుపోయిన ప్రదేశాలను గుర్తించడం, వాటిని శుభ్రం చేయడం వంటివి చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: Sana Mir: అచ్చం రష్మికలానే ఉంది.. ఈమే ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
డెంగ్యూపై భయపడవద్దు, అప్రమత్తంగా ఉండండి సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల చుట్టూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. జాగ్రత్తగా ఉండాలని సీఎం అభ్యర్థించారు. ఇదిలా ఉంటే.. కర్ణాటక ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండు రావు శుక్రవారం వ్యాధి నిఘా డ్యాష్బోర్డ్ను ప్రారంభించారు. ఇందులో డెంగ్యూను సమర్థవంతంగా పర్యవేక్షించడం, నివారణ కోసం మొబైల్ యాప్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాష్బోర్డ్, మొబైల్ యాప్ రెండూ డెంగ్యూపైనే దృష్టి సారించాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య అధికారులు మాత్రమే డ్యాష్బోర్డ్ను యాక్సెస్ చేయగలరని.. ఇది త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..