మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నేడు సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టనుంది. మరోవైపు రెబెల్ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. సోమవారం ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గౌహతి లోని రాడిసన్ బ్లూ హోటల్ లో 2 గంటలకు భేటీ కాబోతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ తో…
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు సీఎం ఉద్ధవ్ వర్గం, అటు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు టూరిజం మంత్రి ఆదిత్య ఠాక్రే, రెబెల్ నేత ఏక్ నాథ్ షిండేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 20న, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారని.. అయితే ఆ సమయంలో షిండే డ్రామాలు చేశారని ఆదిత్య…
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. తాజాగా ‘మహ’ పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరింది. రెబెల్ వర్గం శివసేన ఎమ్మెల్యేలు 16 మందిపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏక్ నాథ్ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. దీంతో పాటు సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అజయ్ చౌదరిని నియమించడాన్ని, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ పై అవిశ్వాసాన్ని తిరస్కరించడాన్ని ఏక్…
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే శివసేన నుంచి ఒక్కక్కరుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వర్గానికి జంప్ అవుతున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. శుక్రవారం అర్థరాత్రి గుజరాత్ వడోదర కేంద్రంగా ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపినట్లుగా వార్తలు…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ఏకంగా 38 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంపు ఏర్పాటు చేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ‘ మహా వికాస్ అఘాడీ’పై తమకు నమ్మకం లేదని.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏక్ నాథ్ షిండే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అల్టిమెటం జారీ చేశారు. తాజాగా ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన 15 మంది…
మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు వర్గం, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గౌహతి నుంచి శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి గుజరాత్ వడోదర వేదిక అయినట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఇద్దరు నేతలు కూడా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాట్ల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్థరాత్రి ఈ భేటీ జరిగినట్లు సంబంధిత వర్గాల నుంచి…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి కూటమి ‘ మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శివసేనలో అసమ్మతి తలెత్తడం, ఏక్ నాథ్ షిండే శివసేనను చీల్చి ఏకంగా 38 మంది ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్ వేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్ధేశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర రాజకీయంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. సినిమాను తలపించేలా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎలాంటి అనుమానాలు రాకుండా శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే పార్టీలో చీలిక తీసుకువచ్చాడు. ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేలలోని 38 మందితో పాటు 8 మంది స్వతంత్రులు ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఉన్నారు. గుజరాత్ సూరత్ నుంచి అస్సాం గౌహతికి రెబెల్ నేతలు క్యాంప్ మార్చారు. మరోవైపు మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు తమ మహావికాస్ అఘాడీ…
మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత నాలుగు రోజులుగా అక్కడ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. దేశం మొత్తం మహా రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇప్పటికే అధికారానికి దూరమయ్యే పరిస్థితుల్లో ఉన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పార్టీపై పట్టు కోల్పోకుండా అడుగులు వేస్తున్నారు. శివసేన పార్టీకి సంబంధించి మొత్తం 56 ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం 38 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే రెబెల్ గ్రూప్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే వరసగా పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు…
మహారాష్ట్రలో రాజకీయం సినిమాను తలపిస్తోంది. రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ‘ మహావికాస్ అఘాడీ’ కూటమి ప్రస్తుతం మైనారిటీలో పడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే తో 37 మంది శివసేన ఎమ్మెల్యేలు అస్సాం గౌహతిలో క్యాంపు ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరో 7-8 మంది స్వతంత్ర ఎమ్యెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో శివసేన ఇప్పుడు అధికారంతో పాటు పార్టీని కూడా…