Aditya Thackeray: సీఎం పదవి ఇస్తామంటే ఏక్ నాథ్ షిండే డ్రామాలాడాడు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు సీఎం ఉద్ధవ్ వర్గం, అటు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు టూరిజం మంత్రి ఆదిత్య ఠాక్రే, రెబెల్ నేత ఏక్ నాథ్ షిండేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 20న, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారని.. అయితే ఆ సమయంలో షిండే డ్రామాలు చేశారని ఆదిత్య ఠాక్రే అన్నారు. ఒక నెల తరువాత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేశారని ఆయన అన్నారు.
యువసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆదిత్య ఠాక్రే.. ఇది తిరుగుబాటు కాదు, వేర్పాటువాదం అని విమర్శించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ఇదంతా చేశారని ఆరోపించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను దోశద్రోహులుగా పేర్కొన్నారు. శివసేనకు ద్రోహం చేసిన వారిని మహారాష్ట్ర ఎప్పటికీ క్షమించదని ఆయన అన్నారు.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
పార్టీని వీడాలనుకే వారికి, తిరిగి రావాలనుకునే వారికి శివసేన తలుపులు తెరిచే ఉన్నాయని.. ద్రోహులుగా ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలను మాత్రం తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఆదిత్య ఠాక్రే అన్నారు. పార్టీ నుంచి కొంత మురికి పోయిందని.. దమ్ముంటే రెబెల్ ఎమ్మెల్యేలు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
శివసేనలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటులో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడింది. 39 మంది వరకు శివసేన ఎమ్మెల్యేలు షిండే వర్గంలో ఉన్నారు. మూడింట రెండొంతుల మంది ప్రస్తుతం షిండే క్యాంపులో ఉండటంతో పార్టీపై కూడా ఉద్ధవ్ ఠాక్రే పట్టు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పదవి సంగతి తరువాత ముందుగా పార్టీని కాపాడుకునే పనిలో ఉద్ధవ్ వర్గం ఉంది. దీంతో వరసగా శివసేన జిల్లా అధ్యక్షులు, జాతీయ కార్యవర్గం సమావేశం, యువ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఏక్ నాథ షిండేకు మంచి పట్టు ఉన్న థానేలోని కార్యకర్తలు, కార్పొరేటర్లలో ఉద్ధవ్ ఠాక్రే భేటీ అవుతున్నారు.
తాజావార్తలు
-
RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్రైజర్స్ ముందు భారీ లక్ష్యం
-
Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా…
-
US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
-
KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
-
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ.. పలు రికార్డ్స్ బ్రేక్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!