Maharashtra Political Crisis: వడోదర వేదికగా ఏక్ నాథ్ షిండే, ఫడ్నవీజ్ రహస్య చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు వర్గం, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గౌహతి నుంచి శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి గుజరాత్ వడోదర వేదిక అయినట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఇద్దరు నేతలు కూడా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాట్ల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్థరాత్రి ఈ భేటీ జరిగినట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం.
గౌహతి నుంచి స్పెషల్ విమానం ద్వారా వడోదల చేరుకున్న ఏక్ నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశం అయ్యారని.. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏక్ నాథ్ షిండే గౌహతి వెళ్లారని తెలుస్తోంది.
Also Read
- CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
- Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
- Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని శివసేన తిరుగుబాటు నేత షిండే వర్గం వ్యతిరేకిస్తోంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే శివసేనకు చెందిన 56 మంది ఎమ్మెల్యేలలో షిండే వర్గంలో 38 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొంత మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇదిలా ఉంటే మహా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులు ఇచ్చారు. సోమవారం సాయంత్రంలోగా స్పందించాలని కోరారు. మరోవైపు షిండే రెబెల్ వర్గం శివసేన కానీ, బాల్ ఠాక్రే పేరును కానీ వాడుకోకుండా ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలో తీర్మాణం చేశారు.
తాజావార్తలు
-
UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
-
Mani Ratnam: సెట్స్పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!