Maharashtra Political Crisis: రాజ్ ఠాక్రేకు ఏక్ నాథ్ షిండే ఫోన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నేడు సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టనుంది. మరోవైపు రెబెల్ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. సోమవారం ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గౌహతి లోని రాడిసన్ బ్లూ హోటల్ లో 2 గంటలకు భేటీ కాబోతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చలు జరుపుతున్నారు.
తాజాగా మహారాష్ట్రలో మరో కీలక పరిణామా చోటు చేసుకుంది. రెబెల్ శివసేన నేత ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రేతో రెండు సార్లు ఫోన్ లో మాట్లాడారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి వీరిద్దరు చర్చించారు. ఇదే విధంగా రాజ్ ఠాక్రే ఆరోగ్యం పరిస్థితి గురించి షిండే ఆరా తీశారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
మరోవైపు ఏక్ నాథ్ షిండే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీంతో పాటు అమాయకులైన ప్రజల ప్రాణాలు తీసిన వారికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని అన్నారు.. వారికి మద్దతు ఇవ్వడం కన్నా చనిపోవడం మేలు అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
ముంబై బాంబు పేలుళ్ల నిందితులు దావూద్ ఇబ్రహీం మరియు అమాయకుల ప్రాణాలను తీయడానికి కారణమైన వారికి మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ, ఇతర ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం అస్సాంలో క్యాంప్ చేస్తున్న షిండే ఆదివారం నాడు పార్టీపై విరుచుకుపడ్డారు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్నవారికి బాలాసాహెబ్ ఠాక్రే శివసేన ఎలా మద్దతు ఇస్తుందని ప్రవ్నించారు. హిందుత్వ భావజాలాన్ని అనుసరించడానికి రెబెల్ ఎమ్మెల్యేలు చనిపోవాల్సి వచ్చినా.. దానిని విధిగా భావిస్తారని ఏక్ నాథ్ షిండే ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!