Maharashtra Political Crisis: రాజ్ ఠాక్రేకు ఏక్ నాథ్ షిండే ఫోన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నేడు సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టనుంది. మరోవైపు రెబెల్ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. సోమవారం ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గౌహతి లోని రాడిసన్ బ్లూ హోటల్ లో 2 గంటలకు భేటీ కాబోతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చలు జరుపుతున్నారు.
తాజాగా మహారాష్ట్రలో మరో కీలక పరిణామా చోటు చేసుకుంది. రెబెల్ శివసేన నేత ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రేతో రెండు సార్లు ఫోన్ లో మాట్లాడారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి వీరిద్దరు చర్చించారు. ఇదే విధంగా రాజ్ ఠాక్రే ఆరోగ్యం పరిస్థితి గురించి షిండే ఆరా తీశారు.
Also Read
మరోవైపు ఏక్ నాథ్ షిండే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీంతో పాటు అమాయకులైన ప్రజల ప్రాణాలు తీసిన వారికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని అన్నారు.. వారికి మద్దతు ఇవ్వడం కన్నా చనిపోవడం మేలు అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
ముంబై బాంబు పేలుళ్ల నిందితులు దావూద్ ఇబ్రహీం మరియు అమాయకుల ప్రాణాలను తీయడానికి కారణమైన వారికి మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ, ఇతర ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం అస్సాంలో క్యాంప్ చేస్తున్న షిండే ఆదివారం నాడు పార్టీపై విరుచుకుపడ్డారు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్నవారికి బాలాసాహెబ్ ఠాక్రే శివసేన ఎలా మద్దతు ఇస్తుందని ప్రవ్నించారు. హిందుత్వ భావజాలాన్ని అనుసరించడానికి రెబెల్ ఎమ్మెల్యేలు చనిపోవాల్సి వచ్చినా.. దానిని విధిగా భావిస్తారని ఏక్ నాథ్ షిండే ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!