Maharashtra Political Crisis: ముంబైలో హై అలర్ట్.. సెక్షన్ 144 విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయం సినిమాను తలపిస్తోంది. రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ‘ మహావికాస్ అఘాడీ’ కూటమి ప్రస్తుతం మైనారిటీలో పడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే తో 37 మంది శివసేన ఎమ్మెల్యేలు అస్సాం గౌహతిలో క్యాంపు ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరో 7-8 మంది స్వతంత్ర ఎమ్యెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో శివసేన ఇప్పుడు అధికారంతో పాటు పార్టీని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 2/3 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఉన్నారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిన్నటి నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం శివసేన జిల్లా అధ్యక్షులతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సమావేశం అయిన తర్వాత నుంచి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పెద్ద సంఖ్యలో శివసైనికులు రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళలకు పాల్పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు పోలీసులు. ముఖ్యంగా ముంబై మహానగరంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
- CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
తాజాగా శనివారం మహారాష్ట్రలోని చాలా చోట్ల శివసేన కార్యకర్తలు రెబెల్ ఎమ్మెల్యే కార్యాలయాలు, ఇళ్ల ముందు ఆందోళన చేశారు. ప్లెక్సీలు చింపివేయడంతో పాటు పలువురు రెబెల్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేశారు. థానేలోని తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే నివాసం వెలుపల భద్రతను పెంచారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో ముంబై నగరంలో పోలీసులు సెక్షన్ 144 సీఆర్పీసీ విధించారు. వచ్చే నెల 10 వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. మరోవైపు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ లో క్యాంపు ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే వర్గానికి ఆ రాష్ట్ర ఎన్సీపీ, శివసేన కార్యకర్తల నిరసనలు ఎదురవుతున్నాయి. హోటల్ వెలుపల వారంతా ఆందోళన చేస్తున్నారు. దీంతో అస్సాం ప్రభుత్వం అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!