Maharashtra Political Crisis:సుప్రీంకోర్టుకు చేరిన “మహా” రాజకీయం..నేడు విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. తాజాగా ‘మహ’ పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరింది. రెబెల్ వర్గం శివసేన ఎమ్మెల్యేలు 16 మందిపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏక్ నాథ్ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. దీంతో పాటు సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అజయ్ చౌదరిని నియమించడాన్ని, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ పై అవిశ్వాసాన్ని తిరస్కరించడాన్ని ఏక్ నాథ్ షిండే వర్గం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. తమ కుటుంబాలకు భద్రత కల్పించేలా మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వారు కోర్టును కోరారు.
తిరుగుబాటు చేసిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ శివసేన ఈ వారం ప్రారంభంలో డిప్యూటీ స్పీకర్ ను కోరింది. అనర్హత అసెంబ్లీకి సంబంధించిన విషయాల్లో మాత్రమే జరగుతుందని.. పార్టీ సమావేశానికి హాజరుకాకపోవడం వల్ల జరగదని షిండే వర్గం పేర్కొంటోంది. అయితే ఈ అంశంపై నేడు సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో అని అందరిలోను ఉత్కంఠత నెలకొంది. సుప్రీంకోర్టులో రెబెల్ ఏక్నాథ్ షిండే శిబిరం తరఫున హరీశ్ సాల్వే , కపిల్ సిబల్ ఉద్ధవ్ ఠాక్రే, ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్నారు. కాగా స్పీకర్ ఉత్తర్వుల ప్రకారం సోమవారం సాయంత్రానికి అనర్హత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తమ వాదనలను స్పీకర్ కు తెలియచేయాలి.
Also Read
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
ఇదిలా ఉంటే శివసేనకు చెందిన 56 మంది ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే వర్గంలో ఏకంగా 39 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 8 మంది మంత్రులు ఉండటం గమనార్హం. అయితే పార్టీని సొంతం చేసుకోవడానికి మూడింట రెండు వంతుల మెజారీటి తమ వద్ద ఉందని ఏక్ నాథ్ షిండే వర్గం చెబుతోంది. ఇదిలా ఉంటే రెబెల్ వర్గం తమను ‘ శివసేన బాల్ సాహెబ్ ఠాక్రే’ వర్గం పిలుచుకుంటుంది. దీనిపై ఉద్ధవ్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇటీవల జరిగి జాతీయ కార్యవర్గం సమావేశంలో బాల్ ఠాక్రే పేరు ఉపయోగించవద్దని తీర్మాణం కూడా చేసింది.
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!