Home
Sharwanand
Sharwanand News
-
“మహా సముద్రం” మోషన్ పోస్టర్
సిద్ధార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ డ్రామా “మహా సముద్రం”. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా “మహా సముద్రం”ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది 2021 ఆగస్టు 19న థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి… -
సైన్స్ ఫిక్షన్ మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్
యువ నటుడు శర్వానంద్ తనను తాను మంచి నటుడిగా నిరూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎప్పుడూ స్టార్డమ్ కోసం ఆశించకుండా సరికొత్త ప్రయోగాలతో ముందుకు సాగుతుంటాడు. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తాడు. ప్రస్తుతం శర్వానంద్ “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న శర్వాతో జోడి కట్టనుంది. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి… -
‘ఆడవాళ్ళు..’కు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు
శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. Read Also… -
‘ఆడవాళ్ళు మీకు జోహర్లు’ షూటింగ్ మొదలెట్టేశారు!
హీరో శర్వానంద్, డైరెక్టర్ కిశోర్ తిరుమల ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. తొలిసారి శర్వానంద్ సరసన నాయికగా నటిస్తోంది రశ్మికా మందణ్ణ. అంతేకాదు… కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి. మంగళవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. పలు తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న రశ్మిక… మొదటిరోజు శర్వానంద్ తో కలిసి షూటింగ్ లో పాల్గొనడం విశేషం. అలానే శర్వానంద్… -
శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ స్నీక్ పీక్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో రూపొందుతోన్న 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’.. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్గా నటిస్తోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలో శర్వానంద్ పోషించిన ఆది పాత్రకి సంభందించి… -
షూటింగ్ పూర్తి చేసిన శర్వా, సిద్ధార్థ్
ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండవ చిత్రం “మహా సముద్రం”. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా ఉంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారికి జోడిగా హీరోయిన్లు అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్స్ రిలీజ్… -
‘ఒకే ఒక జీవితం’ అంటున్న శర్వానంద్!
ఈ యేడాది ‘శ్రీకారం’తో జనం ముందుకు వచ్చిన శర్వానంద్ చేతిలో ఏకంగా మూడు చిత్రాలు ఉన్నాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ మూవీలో నటిస్తున్న శర్వానంద్, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటే అతను నటిస్తున్న ద్విభాషా చిత్రం ఒకటి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఒకే ఒక జీవితం’ అనే… -
శర్వానంద్ 30వ చిత్రానికి ఆసక్తికర టైటిల్
విభిన్న చిత్రాల కథానాయకుడు శర్వానంద్ 30వ చిత్రం తెరకెక్కనుంది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించనుంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి “శర్వా30” అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం టైటిల్ ను ప్రకటించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు నిర్మాతలు.… -
ఉత్కంఠను పెంచిన ‘మహా సముద్రం’ తాజా పోస్టర్
శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముద్రం’.. అను ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఓ గాఢమైన ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కు కూడా అధిక ప్రాధాన్యత ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో ‘గరుడ’ రామ్ కనిపించనున్నారు. తాజాగా ఆయన పోషిస్తున్న ‘ధనుంజయ్’ పాత్రను తెలియజేస్తూ… -
మరోసారి శర్వానంద్ తో మారుతి!
2017 లో ‘మహానుభావుడు’ సినిమాతో దర్శకుడు మారుతి యువ హీరో శర్వానంద్ ను వినూత్నంగా చూపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శర్వా ఓసీడీ (ఓవర్ క్లీనింగ్ డిజార్డర్) తో బాధపడుతున్నట్లు చూపిస్తారు. కమర్షియల్ గా అనుకున్న మేర వసూళ్లను సాధించలేకపోయింది ఈ సినిమా. కాగా మారుతి కథలో శర్వా పాటించిన పద్ధతులనే కరోనా టైమ్ లో అందరూ పాటించక తప్పడం లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నమస్కారం చేయాలి, చేతులు కడుక్కోవాలి, సామాజిక దూరం…
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!