షూటింగ్ పూర్తి చేసిన శర్వా, సిద్ధార్థ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండవ చిత్రం “మహా సముద్రం”. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా ఉంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారికి జోడిగా హీరోయిన్లు అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాగా… అవి సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ చిత్రబృందం మరో అప్డేట్ ను ప్రకటించింది.
Read Also : పాత్రల్లో పరకాయప్రవేశం చేసే గుమ్మడి!
Also Read
ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి కావడంతో గుమ్మడికాయను కొట్టేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ శర్వానంద్, సిద్ధార్థ్ ఉత్సాహంగా కన్పిస్తున్న ఓ పోస్టర్ ను వదిలారు. అందులో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా విశాఖపట్నం బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీత స్వరకర్త. “మహా సముద్రం” థియేటర్లలోనే విడుదల కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!