Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్గాంధీ, ఖర్గే
- ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తతలు
- మోడీ నివాసం ఎదుట నిరసన
- పోలీసుల అదుపు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ నివాసం ఎదుట నిరసన చేపట్టిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు కాంగ్రెస్, ప్రతిపక్ష నాయకులను ఢిల్లీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులను అక్కడి నుంచి బలవంతంగా తరలించే సమయంలో రాహుల్ గాంధీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిరసన ప్రదేశం నుంచి తరలిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘భారత్లో ప్రజాస్వామ్యం ఎలా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.
భారీ నిరసన
రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు, కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. దీంతో అక్కడికి భారీగా పోలీసులు మోహరించి అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్తో పాటు పలువురు ఎంపీలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భారీగా పారామిలిటరీ బలగాలను మోహరించారు.
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ప్రజలకు రాహుల్ పిలుపు
అదుపులోకి తీసుకునే ముందు రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘విద్యార్థులపై దాడి అంటే ప్రతి భారతీయ కుటుంబంపై దాడి చేసినట్టే.’’ అని పేర్కొంటూ నిరసనలో భాగస్వాములు కావాలని కోరారు. విద్యార్థులపై జరిగిన పోలీసు చర్య, నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు. ఈ నిరసనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
పార్లమెంట్లో చర్చ కోరిన ప్రతిపక్షం
విద్యా వ్యవస్థ, నీట్ పరీక్షల అక్రమాలపై పార్లమెంట్లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు రెండు సభల్లో డిమాండ్ చేశాయి. అయితే సభలు వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్ ఎంపీలు నేరుగా ప్రధాని నివాసం వైపు ర్యాలీగా వెళ్లారు. నిరసనలను విరమింపజేసేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ లోక్ కళ్యాణ్ మార్గ్కు చేరుకుని రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. జితేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదట నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే నిరసన విరమిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, ప్రభుత్వం అందుకు అంగీకరించిన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా తప్పనిసరి అని మరో డిమాండ్ ముందుంచినట్లు పేర్కొన్నారు. నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జితేంద్ర సింగ్ వెల్లడించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులపై జరిగిన ఘటనపై హోంమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేసి చర్చ జరపాలని డిమాండ్ చేశారు. గత 45 రోజులుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నామని తెలిపారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్లో చర్చకు అవకాశం ఇవ్వలేదు. అందుకే వీధుల్లోకి రావాల్సి వచ్చింది.’’ అని అన్నారు. కాంగ్రెస్ నేతలు నసీర్ హుస్సేన్, మణికం ఠాగూర్, కే. సురేష్, చరణ్జిత్ సింగ్ చన్నీ, సుఖ్జిందర్ సింగ్ రంధావా తదితరులు విద్యార్థులపై బలప్రయోగం జరిగిందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మంగళవారం ఉదయం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రిలో పరామర్శించారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా ఆర్ఎంఎల్ ఆస్పత్రికి వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా సీజేపీ ప్రతినిధులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే తొలగించాలని, నీట్ అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని మరోసారి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!