సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయన నివాసంలో సంబరాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గంగిరెద్దు విన్యాసాలను తిలకించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు బంధు ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకూ 50వేల కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. రైతులు సంక్రాంతిని రైతుబంధు సంబురాలుగా నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. Read Also: రాష్ట్రంలో శవ రాజకీయాలు చేసేది చంద్రబాబు: మంత్రి…
సంక్రాంతిని పురస్కరించుకొని ప్రయాణీకులు తమ స్వంత ఊళ్లకు బయలు దేరారు. అయితే ప్రభుత్వం 8వ తేది శనివారం నుంచే విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించగా 9వ తేది ఆదివారం ఉదయం నుంచే విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. కాగా 13 గురువారం కూడా కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి లోట్ ప్లాజా, విజయవాడకు సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద…
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన సంక్రాంతి పండగ ప్రాముఖ్యతను వివరించారు. మనదైన అచ్చ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు, వ్యవసాయానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, తెలుగువారికంటూ ఉన్న ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని సీఎం జగన్ అన్నారు. Read Also: పచ్చమందకు పైత్యం బాగా ముదిరింది: విజయసాయిరెడ్డి భోగి మంటలు, రంగ…
సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. మూడు రోజులు నిర్వహించుకునే పండగ కావడంతో చాలా మంది వారం రోజుల పాటు స్వగ్రామాలలో గడిపేందుకు ఊరికి వెళ్తున్నారు. అయితే ఇలాంటి సమయం కోసం వేచిచూస్తున్న దొంగలు పలు చోట్ల రెక్కీలు నిర్వహిస్తున్నారు. దోపిడీలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో రాచకొండ పోలీసులు ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేశారు . తాము ప్రజలను ఊరెళ్లొద్దని చెప్పడం లేదు కానీ, ఇంటికి…
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన సెలవుల్లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అయితే తాజాగా ఈ తేదీలను ప్రభుత్వం మార్చింది. ఇదివరకు ప్రకటించిన సెలవులకు బదులుగా ఈనెల 13(గురువారం), 14(శుక్రవారం), 15(శనివారం) తేదీల్లో సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 13, 14, 15 తేదీల్లోనే…
సంక్రాంతికి కొత్త సినిమాలు సందడి చేస్తాయని తెలుగు ప్రేక్షకులు ఆశించారు. కానీ కరోనా ఆ అవకాశం ఇవ్వలేదు. ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ విడుదల వాయిదా పడింది. ఇక, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ ఇండస్ట్రీకి మరో దెబ్బ. ఇబ్బందనిపిస్తే విడుదల వాయిదా వేసుకోవచ్చని మంత్రి గారే స్వయంగా సెలవిచ్చారు. టికెట్ల ధరలపై దర్శకుడు ఆర్జీవీతో సమావేశం తరువాత మంత్రి పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, టికెట్ల ధరల వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన కమిటీ…
ఏపీలో నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశముందని సీఎం దృష్టికి వచ్చిందని ఎన్టీవీతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడించారు. దీంతో రాత్రి కర్ఫ్యూ అమలులో సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని… ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారని… కరోనా ఎన్ని వేవ్లు వచ్చినా…
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతికి 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. అయితే సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలోప్రత్యేక బస్సులు ఈ నెల 7 నుంచి 14 వరకు నడపనున్నట్టు వెల్లడించారు. 4,318 ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు నడుస్తాయని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్కు కూడా భారీ సంఖ్యలో టీఎస్…
‘ఆర్.ఆర్.ఆర్’ బాక్సాఫీస్ రేసు నుంచి తప్పుకోవడంతో చోటామోటా సినిమాలు అన్నీ విడుదలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దాదాపు పది సినిమాలు అధికారికంగా సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించాయి. వాటితో పాటు కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా రానున్నాయి. వాటిలో అజిత్ నటించిన ‘వాలిమై’, విశాల్ ‘సామాన్యుడు’ కూడా ఉన్నాయి. ఇవి రెండూ కూడా మాస్ ఎంటర్ టైనర్స్ కావటమే ఏకైక ప్లస్ పాయింట్. నిజానికి అజిత్, విశాల్ కి తెలుగులో మార్కెట్ లేదు. విశాల్ కి ఒకప్పుడు ఉన్న…
సంక్రాంతి పండుగకు రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ పలు ప్రాంతాలకు 1266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేశారు. జనవరి 7 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్కు 362 ప్రత్యేక బస్సులు, బెంగళూరుకు 14, చెన్నైకు 20 ప్రత్యేక బస్సులు…