పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతిని పురస్కరించుకొని ప్రయాణీకులు తమ స్వంత ఊళ్లకు బయలు దేరారు. అయితే ప్రభుత్వం 8వ తేది శనివారం నుంచే విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించగా 9వ తేది ఆదివారం ఉదయం నుంచే విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. కాగా 13 గురువారం కూడా కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి లోట్ ప్లాజా, విజయవాడకు సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా భయాందోళనల నేపథ్యంలో ప్రజలు సొంత వాహనాల్లో ప్రయాణానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
Read Also: రైతులు మరణిస్తున్న కేసీఆర్కు సోయి లేదు: షర్మిల
Also Read
ప్రతి ఏడాది సంక్రాంతికి నగర ప్రజలు సొంత ఊర్లకు వెళ్తుంటారు. ఇక అటు టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడుపుతుంది. గురువారం రాత్రి నాటికి ట్రాఫిక్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. మరోవైపు టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ పద్ధతిని అమలు చేస్తుండటంతో కొంత మేర ట్రాఫిక్ కష్టాలు తప్పుతున్నాయి. టోల్ ప్లాజా సిబ్బంది ఫాస్టాగ్ తీసుకోండి సంక్రాంతికి ఫాస్ట్గా వెళ్లండి అంటూ ప్రకటనలు సైతం చేస్తున్నారు. ఇక ఫాస్టాగ్ సౌకర్యం లేనివారు ఎక్కువసేపు ఎదురు చూడాల్సి వస్తోందని ప్రయాణీకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!