తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని సీఎం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయం అనుబంధ రంగాలలో…
సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు కోడి పందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి. అయితే కోడి పందాలు సంప్రదాయ బద్ధంగానే నిర్వహించాలని కోర్టులు తెలుపుతున్నా.. కోర్డుల ఆదేశాలను భేఖాతరు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. భీమవరం, ఉంది, వెంప, దెందులూరు, తణుకు, అమలాపురం, రావులపాలెంలో భారీగా తమ కోళ్లను బరిలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముమ్మిడివరం, రామచంద్రాపురం, కాకినాడ, రాజానగరం, ఐ.పోలవరం,…
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. నేడు భోగి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వేకుకవజామునే భోగి మంటలు వేసి చిన్నాపెద్దా తేడాలేకుండా ఆడిపాడారు. అయితే ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ వరుణుడు విజృంభిస్తుండడంతో తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలకు బ్రేక్ పడింది.…
అత్యంత వైభవోపేతంగా సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఉద్యోగ, వ్యాపారం కోసం ఎక్కడెక్కడో ఉన్న కుటుంబీకులందరూ సంక్రాంతి పండుగకు ఇంటికి చేరుకొని బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు,…
సింహాద్రి అప్పన్నను శ్రీశారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భగుడిలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముందుగా సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి మంటలు వెలిగించి స్వామిజీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సారి భోగి, సంక్రాంతి, కనుమకు ముందురోజు వైకుంఠ ఏకాదశి రావడం ఎంతో అదృష్టమని ఆయన అన్నారు. అదేవిధంగా భోగి మంటలు ఈ మంచి సమయంలో ప్రారంభించడం మహాత్భాగ్యంగా భావిస్తున్నాననన్నారు. ముఖ్యంగా ఈ…
భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీలో సంబరాలు అంబరానంటాయి. వేకువజామునే భోగి మంటలు వేసి కోలాహలంగా కుటుంబ సమేతంగా అందరూ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా కారంచేడులోని తన సోదరి పురందేశ్వరి నివాసంలో నందమూరి బాలకృష్ణ భోగి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని, పంటలు ఇంటికి…
తెలువారందరి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్లిన వారందరూ ఇంటికి చేరుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అయితే భోగి, మకర సంక్రాంతి, కనుమగా ఇలా మూడు రోజులు పండుగను అత్యంత వైభవోపేతంగా తెలుగువారందరూ జరుపుకుంటారు. అయితే నేడు భోగి పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో వేకువజామునే భోగి మంటలు వేశారు. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పండుగ శోభను సంతరించుకుంది. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల…
ఎన్టీవీ.. ఈ సంక్రాంతి నుంచి ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచుతోంది. డిఫెరెంట్ డిఫరెంట్ ప్రోగ్రాంలతో కొత్త కొత్త స్టార్లతో మీ ముందుకు రానుంది. ఇప్పటికే మ్యూజిక్ ఎన్ ప్లే షో తో సంగీత ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రోగ్రాం స్టార్ట్ చేసిన ఎన్టీవీ తాజాగా బిగ్ బాస్ అభిమానుల కోసం మరోకొత్త టాక్ షో ని మొదలుపెట్టింది. బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘ఫన్ ఫీస్ట్ విత్ అషూరెడ్డి’. ఇక ఈ షో…
పండుగలు వచ్చిదంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలు టికెట్ల ధరలను అమాంతంగా పెంచేసి సామాన్యుడు జేబుకు చిల్లుపెడుతుంటాయి. పండుగ సమయాల్లో సుమారు టికెట్ల ధరలో సుమారు 50 శాతం అధికంగా వసూలు చేస్తుంటారు. అయితే అలాంటి ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో 5 ప్రైవేట్ ట్రావెల్స్…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వెళ్లిన వారు తిరిగి తమ సొంతూరు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో సొంతూరు వెళ్లావారితో హైదరాబాద్లోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. ఎక్కడా చూసిన ప్రయాణికుల రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ భారీ ఉంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు సొంత వాహనాల్లో జనాలు సొంతూళ్లకు…