తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ దాదాగిరి చేస్తుందంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అయితే, ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ కౌంటర్ ఎటాక్కు దిగారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు అన్నారు.. ఇక, దాదాగిరి ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్న సజ్జల… కేంద్ర జలశక్తి శాఖ…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజీనామాల వ్యవహారం తెరపైకి వచ్చింది.. రాజీనామాలు చేసేందుకు మేం సిద్ధం.. వైసీపీ ఎంపీలు సిద్ధమా? అంటూ టీడీపీ ఎంపీలు సవాల్ చేస్తున్నారు.. దీనిపై సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబు, తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటే ఎవరు అడ్డుకుంటారు..? మమ్మల్ని అడగటం ఎందుకు ? అని ప్రశ్నించారు సజ్జల.. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేసినప్పుడు టీడీపీ వాళ్ళను అడిగామా? అని నిలదీసిన ఆయన.. ఇక, టీడీపీ…
నామినేటెడ్ పోస్టులు ఇవాళ ప్రకటించాల్సి ఉన్నా… రేపటికి వాయిదా పడింది… అయితే, కసరత్తు పూర్తి కాకపోవడంతో.. పోస్టుల ప్రకటన వాయిదా వేశామని.. రేపు ఉదయం వెల్లడిస్తామని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి… నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉందన్న ఆయన.. మహిళలకు కూడా 50 శాతం పదవులు ఇస్తున్నాం.. కసరత్తులో కొంత అలస్యం అయ్యిందన్నారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సజ్జల.. పార్టీకోసం ముందు నుంచి పని చేస్తున్న వారు, సామాజిక న్యాయం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్…
అమరావతి : తెలంగాణ ప్రభుత్వంలో జైళ్ళశాఖ సూపరెండెంట్ గా ఉన్న దశరథరామిరెడ్డిని ప్రభుత్వ సలహదారు సజ్జలకు ఓఎస్డి గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డిప్యూటేషన్ పై ఇక్కడ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఏపిలో నియమించేందుకు ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ కు అంగీకరించాలని కోరింది ఏపీ ప్రభుత్వం. దీనిపై స్పందించిన తెలంగాణ సర్కార్.. రెండు సంవత్సరాల డిప్యూటేషన్ కు అంగీకరించింది. దశరథరామిరెడ్డికి ఎలాంటి టిఏ డిఏలు వర్తించవని ఆయన విజ్జప్తి మేరకే…
సీఎం జగన్ తండ్రినిమించిన తనయుడు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి సుచరిత, మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని…రెండు రోజులలో ఐదు లక్షల ఇళ్లకు శంఖుస్థాపన జరిగిందన్నారు. read also :…
జలవివాదంపై మరోసారి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తమ వైపు నుంచి పూర్తి సంయమనంతో ఉన్నామని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం భంగం కలగకుండా, పక్క రాష్ట్రంతో అనవసర వివాదాలు ఉండకూడదన్నదే తమ విధానామని పేర్కొన్నారు. కనీస నీటి మట్టం లేకుండానే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని.. రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉభయ రాష్ట్రాలకు ఉందని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. read also : కొత్త పెళ్లి కూతురుకు ఈడీ…
జర్నలిస్టులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. త్వరలో రాష్ట్రంలోని 25 వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఇవాళ సమాచార, ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని, అధికారులతో సమావేశమైన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు… వార, పక్ష, మాస పత్రికలకు సర్క్యులేషన్ బట్టి అక్రిడేషన్లు కేటాయించాలని తెలిపారు. దీంతో.. అక్రిడేషన్ల కోసం ఎదురుచూస్తోన్న…
టిడిపి, బిజేపిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. టీడీపీ-బీజేపీ నేతలు జత కలిశారా అనే అనుమానం వస్తుందని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు రూ. 399 కోట్లు ఉన్నాయని… ఈ సీజనుకు సంబంధించి రూ. 1200 కోట్లు ఇంకా కేంద్రం నుంచి బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఇక్కడి బీజేపీ నేతలు వాటిని రిలీజ్ చేయించేలా చర్యలు తీసుకుని క్రెడిట్ తీసుకోవచ్చని.. ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనలను మేము అనుసరిస్తున్నామని…
సిఎం జగన్ ఢిల్లీ టూర్ పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఢిల్లీ వెళ్లి 5 గురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని కలిశారని.. అదనపు సహాయం, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లిన అన్ని అంశాలను మీడియాకు ఎప్పటికప్పుడు వెల్లడించామని.. ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. గతంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు చీకటి…
ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి స్పందించారు. ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు దుర దృష్టకరమన్నారు సజ్జల. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఈ తీర్పు దురదృష్టకరమని.. కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియను హైకోర్టు సింగిల్ జడ్జి చాలా తేలిగ్గా తీసుకుందన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతోనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కొంతమంది ప్రభావం, ఒత్తిడితో అప్పుడు…