ఒక డైరెక్టర్.. ఎంతో ఇష్టపడి కథను రాసుకొని, కష్టపడి ఆ కథను ఒక సినిమాగా మలిచి.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తాడు. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు తన సొంత బిడ్డను చూసుకున్నట్లు చూసుకుంటారు. ఆ సినిమా కు ఏదైనా డ్యామేజ్ జరిగినా, సినిమా ప్రేక్షకులకు నచ్చకపోయినా ఎంతో మానసిక వేదనకు గురవుతారు.. తాజాగా ఇదే పరిస్థితిని తాను ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చాడు దర్శకుడు వేణు ఉడుగుల. నీది నాది ఒకే కథ చిత్రంతో…
స్టార్లు అందరికి అభిమానులు ఉంటారు.. కానీ కొంతమంది స్టార్లకు మాత్రమే భక్తులు ఉంటారు.. వారి వ్యక్తిత్వానికి ఫిదా అవుతారు.. అలంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు.. పవర్ స్టార్ అంటే ఒక బ్రాండ్ .. ఆయనకు అభిమానులు భక్తులు మాత్రమే ఉంటారు.. ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా భక్తులకు అలాంటివేమీ పట్టవు.. ఒక్కసారి పవన్ అభిమాని అయితే.. జీవితాంతం పవన్ అభిమానినే అంటూ ఉంటారు.. ఇక హీరోల విషయాన్నీ పక్కన పెడితే హీరోయిన్లలో పవర్ స్టార్ ట్యాగ్…
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వి బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో చితబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. “చిన్న ఎవడు..…
ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ‘విరాటపర్వం’ సినిమా.. వాయిదాల మీద వాయిదా పడుతూ ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత రిలీజ్కి ముస్తాబవుతోంది. జూన్ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం అనూహ్యమైన రీతిలో ప్రమోషన్ కార్యక్రమాల్ని చేపట్టారు. జూన్ 5వ తేదీన ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ అనౌన్స్మెంట్కు కూడా చాలా డిఫరెంట్గా ఓ వీడియో రూపంలో ఇచ్చారు. ఈ వీడియోలో ఓ అభిమాని (30 వెడ్స్ 21 ఫేమ్ కార్తీక్)…
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 17 న విడుదల కానున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కు ఏంకర్స్…
దగ్గుబాటి రానా అభిమానులకు రెండు శుభవార్తలను అతని నిర్మాతలు మే 30న కలిగించారు. అందులో మొదటిది వెంకటేశ్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సీరిస్ ‘రానా నాయుడు’ షూటింగ్ పూర్తయిపోయిందనే వార్త. అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సీరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది తెలియచేస్తామని మేకర్స్ తెలిపారు. ఇక రెండోది ఎప్పటి నుండో ఇదిగో అదిగో అంటూ వస్తున్న ‘విరాట పర్వం’ విడుదల తేదీని ప్రీపోన్ చేయడం. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే…
చాలామంది కథానాయికలు ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడరు. ఏదో వచ్చామా, గ్లామర్గా కనిపించామా, నాలుగు పాటల్లో డ్యాన్స్ చేశామా, వెళ్ళామా అన్నట్టుగా లాగించేస్తుంటారు. కానీ, కొందరు అలా ఉండరు. తాము చేసే ప్రతీ పాత్ర ఛాలెంజింగ్గా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం, ఎంత కష్టపడడానికైనా వెనుకాడరు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. నేచురల్ నటిగా తనదైన ముద్ర వేసిన ఈమె.. ఇప్పటిదాకా నటనకు ప్రాధాన్యమున్న ఛాలెంజింగ్ పాత్రల్లోనే నటించింది. ఇప్పుడు పని పట్ల తనకు ఎంత అంకితభావం ఉందో…
కొందరు కథానాయికలు ఏళ్ళ తరబడి ప్రయత్నించినా.. తమదైన ముద్ర వేయలేక తంటాలు పడుతూనే ఉంటారు. పెద్ద పెద్ద సినిమాలు చేసినా సరే, వారికంటూ ఒక గుర్తింపు అంత త్వరగా దొరకదు. కానీ.. సాయి పల్లవి మాత్రం మొదటి సినిమా నుంచే అందరి మనసులు దోచుకోవడం మొదలుపెట్టింది. అందం పరంగా కాదు.. నటన పరంగా! ట్యాలెంట్ ఉంటే అందంతో పని లేదని ఈ నేచురల్ నటి నిరూపించింది. అందరిలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేయలేదు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని…
ప్రస్తుతం సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతకుముందులా ఎలా చేసినా, ఏం చేసినా చూసే ప్రేక్షకులు కారు ఇప్పుడు.. వారిలో కూడా మార్పు వచ్చింది. కథను బట్టి సినిమా చూస్తున్నారు కానీ స్టార్ హీరోనా, చిన్న హీరోనా, వేరే లాంగ్వేజా ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదు. ఇక దీంతో నిర్మాతలు తమ సినిమాలో ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ను గుప్పించేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్, ఐటెం సాంగ్స్.. అందులోనూ ఐటెం సాంగ్స్ అంటే ఖచ్చితంగా స్టార్…
చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు కు ఉన్న లేడీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఛార్మింగ్ లుక్, ఆయన కామెడీ టైమింగ్ కు లేడీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఇక మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో హీరోయిన్లు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికి చాలామంది హీరోయిన్లు మహేష్ సినిమాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక నేను కూడా మహేష్ బాబు అభిమానినే అని నిరూపించుకొంది ఫిదా బ్యూటీ సాయి పల్లవి..…