Virata-Parvam : నేను వెన్నెల ఇది నా కథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమాపై రోజు రోజుకు ప్రేక్షకుల్లో ఆశక్తి పెరుగుతోంది. గత రెండు వారాల నుంచి చిత్రం నుంచి వరుస అప్డేట్ లు రావడం, ప్రమోషన్లలో మేకర్స్ సినిమా గురించి ఆసక్తి కర విషయాలు చెప్పడం చిత్రం పై భారీ అంచనాలను నమోదు చేస్తున్నాయి.
నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు వెంకటేష్ గెస్ట్గా వచ్చాడు. కాగా ఈ వేడుకలో ‘బర్త్ ఆఫ్ వెన్నెల’ పేరుతో వెంకటేష్ నాలుగు నిమిషాల వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియోలో సాయి పల్లవి పుట్టుకును చూపించారు.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ తల్లిని ట్రాక్టర్లో హస్పిటల్కు తీసుకువెళ్తుంటారు. మార్గ మధ్యంలో ఓ వైపు పోలీసులు, మరో వైపు నక్సలైట్స్లు కాల్పులు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ ట్రాక్టర్ను ఆక్కడే ఆపేస్తాడు. ఇక నొప్పులతో బాధ పడుతున్న ఆ తల్లిని చూసి లేడీ నక్సలైట్ (నివేథా పేతురాజ్) పోలీసులకు ఎదురు కాల్పులు జరుపుతూ ట్రాక్టర్ వద్దకు వచ్చి బిడ్డకు పురుడు పోస్తుంది. ఆ బిడ్డని చేతిలోకి తీసుకుని వెన్నెల అని పేరు పెడుతుంది. అంతలోనే నివేథా తలకు బుల్లెట్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలుతుంది.
ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలను తీస్తుంది. కానీ అదే యుద్ధం నాకు ప్రాణాలను పోసింది. నేను వెన్నెల ఇది నా కథ’ అంటూ సాయి పల్లవి వాయిస్ తో వీడియో ముగుస్తుంది. నాలుగు నిమిషాల వీడియోలో ఫస్ట్ ప్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతి షాట్ గూస్బంప్స్ తెప్పించాయి. ఈ వీడియోతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
1990లో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రానా నక్సలైట్ రవన్న పాత్రలో నటించగా సాయి పాల్లవి వెన్నెల పాత్రలో నటించింది. నవీన్ చంద్ర, ప్రియమణి, నివేథా పేతురాజ్, ఈశ్వరీరావు కీలకపాత్రల్లో నటించారు. . శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి సురేష్బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..