Virata-Parvam : నేను వెన్నెల ఇది నా కథ
నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమాపై రోజు రోజుకు ప్రేక్షకుల్లో ఆశక్తి పెరుగుతోంది. గత రెండు వారాల నుంచి చిత్రం నుంచి వరుస అప్డేట్ లు రావడం, ప్రమోషన్లలో మేకర్స్ సినిమా గురించి ఆసక్తి కర విషయాలు చెప్పడం చిత్రం పై భారీ అంచనాలను నమోదు చేస్తున్నాయి.
నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు వెంకటేష్ గెస్ట్గా వచ్చాడు. కాగా ఈ వేడుకలో ‘బర్త్ ఆఫ్ వెన్నెల’ పేరుతో వెంకటేష్ నాలుగు నిమిషాల వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియోలో సాయి పల్లవి పుట్టుకును చూపించారు.
Also Read
- Buchi Babu: 'పెద్ది'ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
- Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. 'పెద్ది' లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
- Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న 'పెద్ది' రిలీజ్..
- Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ తల్లిని ట్రాక్టర్లో హస్పిటల్కు తీసుకువెళ్తుంటారు. మార్గ మధ్యంలో ఓ వైపు పోలీసులు, మరో వైపు నక్సలైట్స్లు కాల్పులు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ ట్రాక్టర్ను ఆక్కడే ఆపేస్తాడు. ఇక నొప్పులతో బాధ పడుతున్న ఆ తల్లిని చూసి లేడీ నక్సలైట్ (నివేథా పేతురాజ్) పోలీసులకు ఎదురు కాల్పులు జరుపుతూ ట్రాక్టర్ వద్దకు వచ్చి బిడ్డకు పురుడు పోస్తుంది. ఆ బిడ్డని చేతిలోకి తీసుకుని వెన్నెల అని పేరు పెడుతుంది. అంతలోనే నివేథా తలకు బుల్లెట్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలుతుంది.
ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలను తీస్తుంది. కానీ అదే యుద్ధం నాకు ప్రాణాలను పోసింది. నేను వెన్నెల ఇది నా కథ’ అంటూ సాయి పల్లవి వాయిస్ తో వీడియో ముగుస్తుంది. నాలుగు నిమిషాల వీడియోలో ఫస్ట్ ప్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతి షాట్ గూస్బంప్స్ తెప్పించాయి. ఈ వీడియోతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
1990లో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రానా నక్సలైట్ రవన్న పాత్రలో నటించగా సాయి పాల్లవి వెన్నెల పాత్రలో నటించింది. నవీన్ చంద్ర, ప్రియమణి, నివేథా పేతురాజ్, ఈశ్వరీరావు కీలకపాత్రల్లో నటించారు. . శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి సురేష్బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు.
తాజావార్తలు
-
Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
-
iQOO Z11 & Z11x: ఐకూ Z11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
-
Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
-
Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!