Breaking: సాయి పల్లవిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ భజరంగ్ దళ్ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సాయి పల్లవి విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది. రానా దగ్గుబాటి హీరోగా నటించిన ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. పలు వాయిదాల తరువాత ఈ సినిమా జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సాయి పల్లవి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
“ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అని చెప్పలేం.. కొన్ని రోజుల ముందు కూడా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా వచ్చింది కదా? .. ఆ టైమ్ లో ఉన్న కాశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు కదా?.. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే.. రీసెంట్ గా ఓ బండిలో ఎవరో ఆవులని తీసుకెళ్తున్నారు. ఆ బండిని నడుపుతున్న వ్యక్తి ముస్లీంగా ఉన్నారు. వాటిని చూసి కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగినదానికి తేడా ఎక్కడ వుంది.. మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా వుంటే ఇతరులను బాధించం.. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం మంచిగా వుండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు” అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి.
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
ఇక దీంతో భజరంగ్ దళ్ నాయకులు ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా తో పాటు.. గో రక్షకులపై సాయి పల్లవి వివాదాస్పద వాఖ్యలు చేసిందని, గోరక్షకులను కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి పల్లవి తన మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణలు కోరాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో పరిశీలించి, లీగల్ ఒపీనియన్ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!