మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గత రాత్రి మాదాపూర్లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పి పడిపోయారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తేజ్ను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి చేర్పించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే తాజాగా,…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు బైక్ ప్రమాదం అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురైయ్యారు.. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సాయి తేజ్ కోలుకోవాలని, ప్రార్థిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు ఆయన్ను చూడ్డానికి ఆసుపత్రికి వస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ను చూసేందుకు మంచు లక్ష్మీ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మంచు లక్ష్మీకి మెగా హీరోలకు మంచిస్నేహ బంధం ఉందన్న సంగతి తెలిసిందే. మరికాసేపటికి క్రితమే హీరో మంచు విష్ణు కూడా…
సాయి ధరమ్ తేజ రోడ్డు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. రోడ్డు ప్రమాదం పై పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు అనే దానిపై విచారణ ప్రారంభించారు. తేజ్ ఇంటి దగ్గర్నుంచి నరేష్ ఇంటికి వెళ్ళిన దానిపై ఆరా తీస్తున్నారు. నరేష్ ఇంటి దగ్గర్నుంచి అతని కొడుకుతో కలిసి తేజ్ బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది. బైక్ రేసింగ్ పాల్పడ్డారన్న అనుమానాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.…
మెగా హీరో సాయ్ ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం.. ఆస్పత్రికి తరలించడం కూడా వెనువెంటనే జరిగిపోయాయి.. ఆయనకు సరైన సమయంలో ట్రీట్మెంట్ అందడం వల్లే ప్రాణాపాయం తప్పింది అంటున్నారు తేజ్కు మొదట ట్రీట్మెంట్ చేసిన మెడికవర్ వైద్యుల బృందం… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మెడికవర్ వైద్యులు.. గోల్డెన్ హవర్లో ట్రోమా కేర్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అని.. ఈ టైంలో ఇచ్చే ట్రీట్మెంటే సాయి ధరమ్ తేజ్ని కాపాడుతోందన్నారు.. ప్రమాదం జరిగిన గంటలోపు వైద్యం…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది. అయితే ఇప్పుడు అభిమానులతో పటు అందరూ ఆయన యాక్సిడెంట్ కు గల కారణం గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పోలిసుల ప్రాధమిక విచారణలో ఆయన అతివేగం, ర్యాష్ డ్రైవింగే యాక్సిడెంట్ కు కారణమని వెల్లడింది. ఈ మేరకు ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. సాయి ధరమ్ యాక్సిడెంట్ కేసు లో పోలీసులకి కొన్ని అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు…
టాలీవుడ్ యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురైన విషయం టాలీవుడ్ లో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం తేజ్ సేఫ్ గానే ఉన్నాడని నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకూ ఆయనకు వైద్యం చేస్తున్న అపోలో ఆసుపత్రి వైద్యులు రెండు హెల్త్ బులెటిన్లు విడుదల చేశారు. అయినప్పటికీ సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు ముందు చేసిన పనుల…
నటుడు సాయి ధరమ్ తేజ్ హెల్త్ పై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడ్డాడని అందులో వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో తేజ్ కు చికిత్స అందిస్తున్నామని, ప్రధాన అవయవాలన్నీ బాగానే ఉన్నాయని, వాటి పని తీరు కూడా బాగుందని, ఈరోజు అవసరమైన మరిన్ని పరీక్షలు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. పరీక్షల అనంతరం రేపు తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరో అప్డేట్ ఇస్తామని,…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్, మాదాపూర్ లో ఉన్న కేబుల్ బ్రిడ్జి పై స్పోర్ట్స్ బైక్ లో ప్రయాణిస్తూ అదుపు తప్పి కింద పడిపోయాడు తేజ్. యాక్సిడెంట్ లో తీవ్రగాయాల పాలైన సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన అపోలో హాస్పిటల్…
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్కు బైక్లంటే ఎంతో ఇష్టం.. అప్పుడప్పుడు ఖరీదైన బైక్లపై హైదరాబాద్లో చక్కర్లు కొట్టేస్తుంటాడు.. 2020లో ఓసారి ఓవర్ స్పీడ్ కారణంగా పోలీసులు ఫైన్ కూడా వేశారు. ఇక, ఇప్పుడు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ బైక్ ఖరీదు అక్షరాల 18 లక్షలు.. ఇది 1160 సీసీతో నడిచే స్పోర్ట్స్ బైక్.. మూడు ఇంజిన్ల ఉండటం ఈ బైక్ ప్రత్యేకత.. దీనిని లగ్జరీ బైక్లకు పేరుగాంచిన ట్రయంప్ సంస్థ తయారు చేసింది. ఈ…
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరో సాయిధరమ్ తేజ్కు అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సాయితేజ్ శరీరంలో అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని, కాలర్బోన్ విరిగిందని పేర్కొన్నారు. ఆయన ఇంకా 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని… ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.. తప్పనిసరిగా కోలుకుంటారాన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు అపోలో వైద్యులు. కాగా, నిన్న రాత్రి…