అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక(25) మృతి చెందింది. ఆమె మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ 18వ మలుపు వద్ద వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నంది. వేగంతో వచ్చిన స్కోడా కారు.. లారీని ఢీ కొట్టింది. దీంతో.. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Bakhtiarpur Car Accident: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భక్తియార్పూర్- బీహార్షరీఫ్ రోడ్డులోని మానసరోవర్ పంప్ సమీపంలో స్కార్పియో, ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు స్పాట్ లోనే మరణించారు.
Gujarat: గుజరాత్లోని ఆనంద్ నగరం సమీపంలోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై సోమవారం ఉదయం ఆగి ఉన్న బస్సును వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మరణించగా, ఆరుగురికి పైగా గాయపడ్డారు.
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగారం హైవే ట్రీట్ సమీపంలో 163 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతులు వాజేడు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో.. కాకర్లపూడి సత్యనారాయణ రాజు, భార్య సత్యవతి ఉన్నారు. అయితే.. తమ కూతురు అనితను వైజాగ్ వెళ్లేందుకు…
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ట్రక్కు, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన ఓల్డ్ కంటోన్మెంట్ ప్రాంతంలోని మోరెనా హైవేపై తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరిగింది. కుటుంబ సమేతంగా ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు…
Road Accident : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గౌటెంగ్ ప్రావిన్స్లోని మెరాఫాంగ్ స్థానిక మునిసిపాలిటీలో బుధవారం ఉదయం మినీబస్సు, ట్రక్కు ఢీకొనడంతో 12 మంది విద్యార్థులతో సహా 13 మంది మరణించారు.