Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి
- అదుపుతప్పి కాలువలో పడ్డ కారు
- ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి
- మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తింపు
- జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్లో ఘటన
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంత్నాగ్ జిల్లా సమీపంలోని సింథాన్-కోకెర్నాగ్ రహదారిపై వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. కారులో ఉన్నవాళ్లంతా కిష్త్వార్ నుంచి వస్తున్నారు.
READ MORE: IPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రో భారత్లోనే తయారీ.. యాపిల్ నిర్ణయంతో చైనాకు టెన్షన్!
Also Read
- US-Iran War: "ట్రంప్పై నమ్మకం లేదు".. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
- T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్ము రీజియన్లోని కిష్త్వార్ నుంచి వస్తున్న JK03H9017 నంబర్ గల సుమో వాహనం దక్సమ్ సమీపంలో అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు (పోలీస్) మృతి చెందారు. మృతుల్లో భార్యభర్తలు ఉండగా.. వారి పేర్లు ఇంతియాజ్, అఫ్రోజాగా గుర్తించారు. ఈ ప్రమాదానికి గురైన ఇంతియాజ్ వృత్తిరీత్యా పోలీసు. పోలీసు అధికారి ఇంతియాజ్ అహ్మద్ తన ఐదుగురు పిల్లలు, భార్య, మరో మహిళతో కలిసి కారులో కిష్త్వార్ నుంచి మద్వా కిష్త్వార్లోని తన ఇంటికి వస్తు్న్నారు. కిష్త్వార్-అనంతనాగ్ రహదారిలోని అరషన్ ప్రదేశంలో ప్రమాదానికి గురయ్యారు. వాహనం కాలువలో పడిపోయింది. ప్రమాదం అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటని పోలీసులు తెలుసుకుంటున్నారు. ప్రమాదం తర్వాత కారు పూర్తిగా ధ్వంసమైంది.
READ MORE:IPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రో భారత్లోనే తయారీ.. యాపిల్ నిర్ణయంతో చైనాకు టెన్షన్!
గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ..
సెంట్రల్ కాశ్మీర్లోని గందర్బాల్ జిల్లాలోని జోజిలా పాస్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరుకు చెందిన ముగ్గురు పర్యాటకులు ప్రయాణిస్తున్న కారు లోతైన లోయలో పడింది. ఇద్దరు మరణించగా..ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తాజావార్తలు
-
US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
-
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
Police Complaint: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!