వరద బాధితులకు నష్టపరిహారం 10 వేలు కాదు.. 25 వేలు ఇవ్వాలరి వై.ఎస్.షర్మిళ డిమాండ్ చేసారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణం న్యూ పోరేడు పల్లి కాలనీలో వైఎస్ షర్మిల పర్యటించారు. వర్షానికి తమ కాలనీ మొత్తం మునిగిపోయిందని షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేసారు కాలనివాసులు. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన నష్టపరిహారం ఇంకా అందలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రామగుండం పట్టణం లో వరదలకు కారణం కేసీఅర్ వైఫల్యమే అంటూ విమర్శించారు.…
ఎన్టీపీసీ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలోనే అతిపెద్దదైన తేలియాడే సోలార్ ప్లాంట్ ను నిర్మించింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. పివీ ప్రాజెక్ట్ లో భాగంగా చివరిదైన 20 మెగావాట్లను ఉత్పత్తి ప్రారంభం అయింది. దీంతో మొత్తం 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పరిచేస్తోంది. ఈ ఘనత సాధించినందుకు రామగుండం టీమ్ ను ఎన్టీపీసీ…
ఒకరు అధికారదర్పంతో అస్తి కోసం సొంత బామ్మర్దినే హత్య చేయించారు. మరికొందరు అధికారబలం ఉందని సామాన్యులపై దాడులకు తెగబడ్డారు.స్థానిక మహిళలపై కూడా జులుం ప్రదర్శిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతకొంతకాలంగా పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేటర్లు నాయకుల తీరు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..కబ్జాలు,బెదిరింపులతో రామగుండం కార్పొరేషన్లో కొందరి ప్రజాప్రతినిధుల తీరు స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.. రామగుండం కార్పొరేషన్ నిత్యం సమస్యలకు నిలయంగా మారింది.అక్కడి ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలపై కంటే దాడులు, బెదిరింపులకే ప్రాధాన్యత ఇవ్వడంతో బిక్కుబిక్కుమంటూ…
నగరంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉక్కపోతతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. గరిష్టంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత.. కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎండల తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి సిటీ ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగలతో నగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి. రోజుకు సగటున 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నగరంలో ఎండల తీవ్రత…
కాలుష్యం పెరిగి కొద్దీ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కాలుష్య సుడిగుండంలా మారుతోంది. పారిశ్రామిక అభివృద్ధి ఈ ప్రాంతానికి శాపంలా మారింది. రామగుండంలో భూగర్భం ఉపరితలం అంతా విషతుల్యంగా తయారైంది. ఏ విష వాయువు ఎప్పుడు వ్యాపిస్తుందో తెలియక తాగే నీరు కలుషితంతో అనారోగ్యాల బారిన పడుతూ జనం ఆందోళన చెందుతున్నారు. రామగుండం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్, జెన్…
బూడిద అంటే గతంలో అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు బూడిద అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. ప్రజాప్రతినిధులు మాఫియాగా ఏర్పడి వందల లారీల ద్వారా కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. రోజుకి లక్షల రూపాయల ఎన్టీపీసీ యాజమాన్యం సొమ్మును కొట్టేస్తున్నారు. రోజువారీ ఎవరి వాటా వారికి అప్పగిస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బొగ్గు ఆధారిత ప్రాజెక్టులో బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.కుందనపల్లి గ్రామం వద్ద 1700…
దేశానికి వెలుగును అందిస్తున్న రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిరాదరణకు లోనవుతోందని మండిపడ్డారు రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇతర ప్రాంతాల్లో విద్యుత్ పరిశ్రమలు నెలకొల్పేందుకు రామగుండం సింగరేణి దోహదపడింది. ఎన్ని ప్రభుత్వాలు మారిన రామగుండం లో బిపిఎల్ రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం ను చీకటి మాయం చేయాలని చూస్తున్నారు.రామగుండం ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు. రామగుండం లో జరుగుతున్న బుడిద మాఫియా పై విజిలెన్ విచారణ…
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణిలోని బొగ్గు గనిలో పైకప్పు కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు పనిచేస్తుండగా ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు రాగా ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. తొలుత వారు మరణించారని ప్రచారం జరిగింది. అయితే సోమవారం రాత్రి సమయంలో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో నలుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందం…