Peddapalli district :ఆ జిల్లాలో పార్టీలకు అతీతంగా బీసీ నేతలంతా ఒక్కటయ్యారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జిల్లాలో పార్టీలకు అతీతంగా బీసీ నేతలు ఒక్కటయ్యారా? రహస్య సమావేశాలతో ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారా? వాళ్ల డిమాండ్స్కు ప్రధానపార్టీలు లొంగుతాయా? ఇంతకీ భేటీలో ఉన్నవాళ్లంతా ఏ నియోజకవర్గంపై గురిపెట్టారు? లెట్స్ వాచ్..!
పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం వాడీవేడీ చర్చకు కారణం అవుతున్న సమావేశం ఇదే. ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్లంతా వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు. అందరి అజెండా ఒక్కటే. పెద్దపల్లి టికెట్ను వచ్చే ఎన్నికల్లో బీసీలకు కేటాయించాలని. ఏ పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెడితే వారికే మద్దతు ఇవ్వాలని తీర్మానించేశారు. ఇందుకు నియోజకవర్గంలోని లెక్కలను కూడా బయటకు తీయడంతో అన్ని శిబిరాల్లోనూ అలజడి మొదలైంది. ఎన్నడూ లేనిది ఎందుకు రహస్య సమావేశాలు పెట్టుకున్నారు? వేర్వేరు పార్టీలలో ఉన్నప్పటికీ.. జెండాలు, కండువాలు పక్కన పడేసి ఎన్నికల్లో బీసీ అజెండాగా అడుగులు వేయగలరా అనేది ప్రశ్న.
Also Read
పెద్దపల్లి జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి, మంథని, రామగుండం. వీటిల్లో పెద్దపల్లి ఓటర్లలో 74 శాతం బీసీలే. ఎస్సీఎస్టీలు 20 శాతం వరకు ఉన్నారు. కానీ ఎన్నికల్లో మాత్రం ఆరేడు శాతం ఓటర్లుగా ఉన్న ఓసీలకే టికెట్ ఇస్తున్నారని రహస్య సమావేశంలో ఫైర్ అయ్యారట నేతలు. పెద్దపల్లిలోని అప్పన్నపేట లైన్ భవనంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమురయ్య, జడ్పీ టీసీ గంటా రాములు, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకులు వచ్చారు. ఎవరికి వారు తమ పార్టీలు బీసీలకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కాకుండా.. ఏ పార్టీ బీసీలకు ఛాన్స్ ఇచ్చినా.. వాళ్లకు మద్దతివ్వాలని తీర్మానించడమే ఆసక్తి కలిగిస్తోంది. గతంలో పెద్దపల్లిలో మూడుదఫాలు బీసీ అభ్యర్థులకు వివిధ పార్టీలు ఛాన్స్ ఇచ్చాయి. ఇప్పుడు మాత్రం పోటీ చేసే అవకాశం బీసీలకు లభిస్తే.. గెలిపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారట.
బీసీల ఐక్యత అనే నినాదాన్ని పెద్దపల్లిలో గ్రామ గ్రామానికీ తీసుకెళ్లాలని సమావేశంలో పాల్గొన్న నేతలు నిర్ణయించారట. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఒకే వాయిస్ వినిపిస్తే ఫలితం ఉంటుందని లెక్కలేస్తున్నారట. బీసీ నేతల రహస్య సమావేశం ఎలా ఉన్నా.. ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న ఇతర సామాజిక వర్గాల నేతలకు టెన్షన్ పట్టుకుందట. తమకు పార్టీ అవకాశం ఇస్తే.. బీసీ సామాజికవర్గం సహకరించకపోతే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. మంథని, రామగుండం నియోజకవర్గాలలో కూడా బీసీలు గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు. అక్కడ కూడా ఇదేవిధంగా ఒత్తిడి తెస్తే సమీకరణాలు మారిపోతాయని ప్రచారం జరుగుతోంది.
జెండాలు.. అజెండాలు పక్కన పెట్టాలన్న మాటలు సమావేశంలో పాల్గొన్న వారికి ఉత్సాహం తీసుకొచ్చినా.. ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చాక ఆ మాటపై నిలబడతారా అనే ప్రశ్నలు ఉన్నాయట. మరి.. రహస్య గళాలు.. సమావేశాలు ప్రధాన పార్టీలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో.. ఎవరికి టికెట్ ఇస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!