Y. S. Sharmila: నష్ట పరిహారం 10వేలు కాదు.. 25వేలు ఇవ్వాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరద బాధితులకు నష్టపరిహారం 10 వేలు కాదు.. 25 వేలు ఇవ్వాలరి వై.ఎస్.షర్మిళ డిమాండ్ చేసారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణం న్యూ పోరేడు పల్లి కాలనీలో వైఎస్ షర్మిల పర్యటించారు. వర్షానికి తమ కాలనీ మొత్తం మునిగిపోయిందని షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేసారు కాలనివాసులు. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన నష్టపరిహారం ఇంకా అందలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రామగుండం పట్టణం లో వరదలకు కారణం కేసీఅర్ వైఫల్యమే అంటూ విమర్శించారు. అవగాహన లేకుండా ప్రాజెక్ట్ లు కట్టి ఈ పరిస్థితి తెచ్చాడని మండిపడ్డారు. వరదలతో సర్వం కోల్పోయారని, నష్టపరిహారం ఇస్తామని మరో మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. – ఇప్పటి వరకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదు ? అని షర్మిళ ప్రశ్నించారు.
నష్టపరిహారం 10 వేలు కాదు 25 వేలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా టీఆరెఎస్ పార్టీ అకౌంట్ నుంచి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేసారు. టీఆర్ఎస్ అకౌంట్ లో 860 కోట్లు ఉందని, ప్రతి నెల వడ్డీ 3 కోట్లు వస్తుందని కేసీఅర్ చెప్తున్నాడని షర్మిళ ఆరోపించారు. వరదలతో ఎంతో మంది జీవితాలు ఆగం అయ్యాయని మండిపడ్డారు. కడెం ప్రాజెక్టు గేట్లు మరమత్తులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నిప్పులు చెరిగారు. మూడేళ్లుగా గేట్లు మార్చాలని చెప్తున్న కేసీఅర్ పట్టించుకోలేదని, గేట్లు మేనేజ్ చేసే సిబ్బంది 33 మంది ఉండాల్సిన చోట ముగ్గురు మాత్రమే ఉన్నారని షర్మిళ అన్నారు. లక్షల కోట్లు పెట్టీ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పంప్ హౌజ్ లను కూడా కాపడుకొలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదని విమర్శించారు. కానీ.. బ్యాక్ వాటర్ తో వేల ఎకరాలకు పంట నష్టం జరిగిందని వై.ఎస్. షర్మిళ పేర్కొన్నారు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
iOS 16: ఏడు కొత్త ఫీచర్లతో కొత్త ఓఎస్.. ఆండ్రాయిడ్ తరహాలోనే!
తాజావార్తలు
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!