బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దిగి విజయం సాధించారు. నితీష్ కుమార్తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కూడా రాజ్యసభకు వెళ్లారు.
దేశ వ్యాప్తంగా సోమవారం రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్లో 37 మంది సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి.