NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- ఎన్డీఏ పార్టీల కీలక సమావేశం..
- రాజ్యసభ ఎన్నికలు, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, ‘సర్’ పై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NDA Meeting Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ఎన్డీఏ పార్టీల కీలక సమావేశం అమరావతిలో జరిగింది. గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలు, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, అలాగే ‘సర్’ (Special Intensive Revision – SIR) ప్రక్రియపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రానికి లభించే నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి, ఒక స్థానం జనసేన పార్టీకి దక్కే అవకాశాలపై నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.
అలాగే ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్’ ప్రక్రియపై కూడా కూటమి ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరిగింది. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ‘సర్’ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాలపై ఎమ్మెల్యేలు స్పష్టమైన అవగాహనతో ప్రజల్లోకి వెళ్లేలా అవగాహనా తరగతులు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాల ద్వారా ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంపై దృష్టి సారించనున్నారు.
Also Read
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
ఇక కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలనే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే దిశగా కూడా నేతలు ఆలోచించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల పాలనలో అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
Epic: ‘కడలి’ ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది.. ఫ్యామిలీ ఆడియన్స్ ని ‘ఎపిక్’ మెప్పిస్తుంది : వైష్ణవి చైతన్య
-
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్లుక్ వచ్చేసింది!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!