Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Rajya Sabha Candidates List 2026: కాంగ్రెస్ పార్టీ 2026 రాజ్యసభ ఎన్నికల కోసం తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించిన ఈ జాబితాలో పలు కీలక నేతలకు అవకాశం కల్పించింది. ముఖ్యంగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు కర్ణాటక కోటా నుంచి రాజ్యసభ టికెట్ కేటాయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ ఖేరా పేరు ఈ జాబితాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో 2022 రాజ్యసభ ఎన్నికల సమయంలో తనకు టికెట్ రాకపోవడంతో సోషల్ మీడియాలో “బహుశా నా తపస్సులో ఏదో లోపం ఉందేమో” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇవ్వడంతో ఆ ‘తపస్సు’ ఫలించిందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.
* కాంగ్రెస్కు బలమైన కోటగా ఉన్న కర్ణాటక నుంచి ఈసారి ముగ్గురు ప్రముఖ నేతలను పార్టీ బరిలోకి దింపింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి రాజ్యసభకు పోటీ చేయనుండగా, జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు కూడా అవకాశం కల్పించారు. అలాగే మైనారిటీ వర్గానికి చెందిన ప్రముఖ నేత మన్సూర్ అలీ ఖాన్ను కూడా కర్ణాటక కోటా నుంచి అభ్యర్థిగా ప్రకటించారు.
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
* మధ్యప్రదేశ్ నుంచి మాజీ లోక్సభ సభ్యురాలు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ టికెట్ లభించింది. మాల్వా ప్రాంతానికి చెందిన ఆమెకు అవకాశం ఇవ్వడం ద్వారా మహిళా నాయకత్వానికి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
* రాజస్థాన్ నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు నీరజ్ డాంగీకి మరోసారి అవకాశం దక్కింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయనపై పార్టీ అధిష్ఠానం మరోసారి విశ్వాసం వ్యక్తం చేసింది.
* తమిళనాడు నుంచి కాంగ్రెస్ డేటా అండ్ అనలిటిక్స్ విభాగం ఛైర్మన్ ప్రవీణ్ చక్రవర్తికి రాజ్యసభ టికెట్ కేటాయించారు. రాహుల్ గాంధీకి సన్నిహిత విధాన సలహాదారుడిగా గుర్తింపు పొందిన ప్రవీణ్ చక్రవర్తి పార్టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
* జార్ఖండ్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శి, కమ్యూనికేషన్స్ విభాగం సీనియర్ నేత ప్రణవ్ ఝాకు అవకాశం లభించింది. మీడియా నిర్వహణ, సంస్థాగత వ్యవహారాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగానే ఈ అవకాశం వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటించిన ఈ జాబితా ద్వారా పార్టీ సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతుల్యత, సంస్థాగతంగా పనిచేసిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ వంటి నేతలకు అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు సంకేతాలు ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. ఇంగ్లాండ్పై ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్గా శ్రేయస్..
-
RailOne Ticket Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆ టిక్కెట్స్ చెల్లవు.. కొత్త నిబంధనలు వెల్లడించిన భారతీయ రైల్వే
-
FIFA World Cup 2026: ఎంబాప్పే మాయ.. వరుసగా మూడో ప్రపంచకప్లో సెమిస్ లోకి ఫ్రాన్స్ ఎంట్రీ.!
-
India vs England: భారత్ చెత్త రికార్డు.. ఏడేళ్ల తర్వాత…!
-
Lenin Review : అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ఓవర్శీస్ రివ్యూ..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!