ఏపీలో భారీ వర్షాల కారణంగా టమోటాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు వంద దాటిపోగా ఇప్పుడు టమోటాల ధరలు కూడా వంద దాటిపోయాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ అయిన మదనపల్లిలో కిలో టమోటా ధర ఏకంగా రూ. 130 పలుకుతున్నది. వి.కోట మార్కెట్లో 10 కేజీల టమోటాలు రూ.1500 పలుకుతున్నాయి. భారీ వర్షాలు కురవడంతో పంట పాడైపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వర్షాలు తగ్గి, వరద ఉధృతి పూర్తిగా తగ్గి మళ్లీ కొత్త…
దక్షిణ బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ప్రభావం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల27 వరకు తేలిక పాటినుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం..మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి…
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కొన్ని రోజులుగా దక్షిణాదిలోని ఆయా ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఉత్తర బెంగళూరు, ఉత్తర చెన్నై ప్రాంతాలను వరదలు ముంచె త్తాయి. కోసస్తలైయార్ నదికి వరద పోటెత్తడంతో ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు,కడప, నెల్లూరు పై కూడా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. బెంగళూరు, చైన్నై, ఏపీలలో ఇప్పటివరకు 24 మంది మరణించగా, పలువురు గల్లంతైనట్లు జాతీయ విపత్తునిర్వహణ అధికారులు తెలిపారు.…
రాయల చెరువుకు ఇంకా ప్రమాదం పొంచి ఉంది. చెరువుకు ఉత్తర భాగాన వాటర్ లీకేజీతో మరో గండి ఏర్పడింది గండి పూడ్చివేతకు అధికారులు చర్యలు చేపట్టారు. చెరువు లీకేజీతో 20 గ్రామాలకు ముప్పు ప్రమాదం ఉంది. చెరువు గరిష్ఠ నీటి మట్టం 0.6 టీఎంసీల కాగా, ప్రస్తుతం చెరువులో 0.9 టీఎంసీల నీరు ఉంది.నిన్నటి నుంచి దాదాపు 20వేలమంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిరుపతి శివారులో మూడు సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసారు అధికారులు. దగ్గరుండి ఏర్పాట్లు…
తిరుపతి రాయల చెరువు ప్రమాదకరంగా ఉంది. ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయం పై ఎన్టీవీతో స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ… రాయల్ చెరువు పరిస్థితి క్రిటికల్ గా ఉంది. రాత్రి దేవుడు దయతో భయటపడాలీ అని కోరుకుంటున్నాం. మా ప్రయత్నాలు మేము వంద శాతం గండి పూడ్చానికి చేస్తాం. 0.9 టి.ఎం.సి నీళ్ళు రాయల్ చెరువులో ప్రస్తుతం వున్నాయి. గతంలో ఇంత కెపాసిటీ నీళ్ళు గతంలో ఏ చెరువుకు రాలేదు. కాబట్టి…
తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన హన్మకొండలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కేంద్రాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. రాష్ర్టంలో 7000కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చాల్సి ఉన్నా ప్రస్తుతం 4000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్ర మే ప్రభుత్వం…
దక్షిణ అండమాన్ మరియు దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3 . 1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దక్షిణ అంతర్గత కర్ణాటక , దాని పరిసర ప్రాంతాల మీద సగటు సముద్ర మట్టానికి 5 .8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన చేసింది వాతావరణ శాఖ.…
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ-చెన్నై మార్గంలోని పడుగుపాడు వద్ద రైలుపట్టాలపైకి నీళ్లు చేరాయి. కాసేపటికే వరద ఉధృతి కారణంగా రైల్వేట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో పలు చోట్ల రైలుపట్టాలు గాల్లో వేలాడుతున్నాయి. Read Also: అలెర్ట్ : ఏపీలో…
వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం జగన్. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలి. అక్కడున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. పట్టణాల్లో పారిశుద్ధ్య పనుల, డ్రైనేజీల పూడికతీత పనులతో…
చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ వాగులు పోంగుతున్నాయి… గండికి కూడా గురైతున్నాయి చెరువులు. మరో వైపు చుక్కనీరు లేకుండా అవిలాల ,తుమ్మలగుంట చెరువులు వెలవెలపోతున్నాయి. రోండు చెరువులుకు సప్లై చానల్స్ ఆక్రమణకు గురికావడంతో తమ గ్రామాలు ముంపుకి గురైతుందని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు పేరూరు,పుదిపట్ల గ్రామస్థులు. వరద ప్రవాహంతో ప్రమాదస్థితికి పేరూరు చెరువు చేరుకుంటుంది. పేరూరు చెరువుకు ఇన్ ప్లో తగ్గింపుపై దృష్టి పెట్టారు…