బీజేపీ నేతల మాటలకు మాజీ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అని బీజేపీ నేతలు అంటున్నారని.. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబమని మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతురావు అన్నారు. రాహుల్ గాంధీ కులగణన చేసి దేశంలోని అన్ని కులాలకు న్యాయం చేయాలని చూస్తుంటే.. ప్రధాని మోడీ మాత్రం కులాల మధ్య రాహుల్ గాంధీ చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు సోము వీర్రాజు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రజా పాలన సాగుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారన్నారు.
కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. టైటానిక్ పడవ ను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారన్నారు.
CM Revanth Reddy : కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కులగణన సంప్రదింపుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పౌరసమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి…
రాహుల్ గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యల గురించి హైదరాబాద్ పర్యటనలో మాట్లాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
Harish Rao: రాహుల్ గాంధీ మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్లోని నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే.. మీ సో-కాల్డ్ ప్రజా పాలనలో విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ పోస్ట్ చేశారు. అందులో బలహీనుడి గళం. సామాజిక న్యాయ రణం.. రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ రాసుకొచ్చారు.