PM Modi: కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు..
- రాజ్యాంగ ఆమోదానికి రేపటితో 75 ఏళ్లు..
- విస్తృతంగా చర్చించి రాజ్యాంగాన్ని రూపొందించారు..
- పార్లమెంట్ సమావేశాల్లో సరైన చర్చ జరగాలి..
- కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నేడు (సోమవారం) శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ దగ్గర భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను కోరారు. ప్రస్తుతం మనం 2024వ ఏడాదిని పూర్తి చేసుకోబోతున్నాం.. 2025 కోసం దేశం మొత్తం సిద్ధమవుతోందన్నారు. ఈ పార్లమెంట్ సెషన్స్ ఎన్నో అంశాల పరంగా ముఖ్యమైంది.. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబరు 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నామని పేర్కొన్నారు. దానికి గుర్తుగా రేపు సంవిధాన్ సదన్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందామని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: Prashant Kishor: బీహార్ చాలా దారుణమైన స్థితిలో ఉంది.. అది ఒక విఫల రాష్ట్రం..
Also Read
- Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
ఇక, ప్రజల చేత తిరస్కరణకు గురైన కొందరు.. గూండాయిజం చేయించి.. పార్లమెంట్ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. వారి చర్యలను దేశ ప్రజలు చూస్తున్నారు.. సమయం వచ్చినప్పుడు వారు చూస్తూ ఊరుకోరని చెప్పుకొచ్చారు. అయితే, ఇక్కడ బాధించే విషయం ఏంటంటే.. పార్టీలతో సంబంధం లేకుండా కొత్తగా పార్లమెంట్కు ఎన్నికైన వారు సరికొత్త ఆలోచనలతోయ వస్తారు.. కొందరు చేసే గందరగోళ చర్యల వల్ల కొత్తగా వచ్చిన ఎంపీలకు సభలో మాట్లాడే ఛాన్స్ రావడం లేదన్నారు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించాలి.. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలన్నారు. అలాంటి వారికి ప్రజలపై ఎలాంటి బాధ్యత ఉండదు.. కాబట్టి ప్రజల అంచనాలను ఎన్నటికీ అందుకోలేరని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.
- Tags
- bjp
- congress
- Media
- PM Modi
- rahul gandhi
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!