కాంగ్రెస్ అగ్ర ప్రియాంకాగాంధీ నామినేషన్ పత్రాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈనెల 23న ప్రియాంకాగాంధీ వయనాడ్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అగ్ర నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఆమె నామినేషన్ వేశారు. అయితే తాజాగా ప్రియాంక నామినేషన్ ఆమోదం పొందినట్లు సోమవారం అధికారులు ప్రకటించారు.
జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు . ఎక్స్లో కాంగ్రెస్ అధినేత తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జమ్మూకశ్మీర్లో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
Wayanad bypoll:కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వయానాడ్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రియాంకా తన నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.
Priyanka Gandhi Nomination: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తు్న్న ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఈరోజు (బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు.
దేశంలో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఒకెత్తు అయితే వయనాడ్ బైపోల్ మాత్రం రసవత్తరంగా మారింది. ఇక్కడ తొలిసారి ప్రియాంకాగాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించి పోటీ చేయడమే కారణం.
కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఎల్లుండి (బుధవారం) ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో.. వయనాడ్లో పెద్ద ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ర్యాలీలో ప్రియాంక గాంధీతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొననున్నారు.
తెలంగాణలో జీఓ 29 దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి గుదిబండ కాబోతోందా? బీజేపీ అగ్ర నాయకత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటోందా? వివాదం ముదిరితే ఏకంగా రాహుల్ గాంధీనే మాట్లాడటానికి ఇరుకున పడే ప్రమాదం ఉందా? ఇంతకీ ఏంటా జీవో 29? దానితో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? జీఓ నంబర్ 29ని రద్దు చేయాలని, జీఓ 55ను అమలు చేయాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు గ్రూప్ వన్ అభ్యర్థులు. దాని…
Rahul Gandhi: ఒడియా నటుడు బుద్దాదిత్య మొహంతి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని గురించి సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ పెట్టిన కారణంగా బుద్దాదిత్యపై కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ ఎన్ఎస్యూఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ శుక్రవారం క్యాపిటల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుద్ధాదిత్య సోషల్ మీడియా పోస్టుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ అక్టోబర్ 23న (బుధవారం) వయనాడ్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 13న లోక్సభ ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్.. ప్రియాంక పేరును అధికారికంగా ప్రకటించింది. ప్రియాంక వెంట ఆమె భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీ ఉండనున్నారు.