BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓటుకు నోటు’’.. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు..
- మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓటుకు నోటు’’..
- కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన బీజేపీ నేత..
- రాహుల్ గాంధీ, ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్..
- లేకపోతే పరువునష్టం కేసు ఎదుర్కోవాలన్న వినోద్ తావ్డే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వినోద్ తావ్డే, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సుప్రియా శ్రీనాట్, రాహుల్ గాంధీలకు లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్లోని ఓ హోటల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేత రూ.5 కోట్లు పంపిణీ చేశారని బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) నాయకుడు హితేంద్ర ఠాకూర్ మంగళవారం ఆరోపించిన నేపథ్యంలో తావ్డే లీగల్ నోటీసు వచ్చింది.
తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడువని, నిరాధారమైనవని, దుష్ర్పవర్తనతో చేసినవని తావ్డే నోటీసుల్లో పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో తనపై ఆరోపణలు చేసిన ముగ్గురు కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు, ఒక హోటల్లో చొరబడిన బీవీఏ కార్యకర్తలు అక్కడే ఉన్న తావ్డే రూ. 5 కోట్లతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడనే వీడియోని పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్గా మారింది. హోటల్ గదుల నుంచి రూ. 9.93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మంగళవారం తెలిపారు.
Also Read
- Mayawati's Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
తావ్డే ఈ ఆరోపణల్ని ఖండించారు. తాను ఎన్నికల విధానాలపై పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకత్వం మాత్రమే అందిస్తున్నానని, ప్రత్యర్థి హోటల్లో డబ్బు పంపినీ చేసేంత తెలివితక్కువ వాడిని కాదని అన్నారు. వివంతా హోటల్ ఠాకూర్లకు చెందినదని, వారి హోటల్కి వెళ్లి అక్కడ డబ్బు పంచేంత మూర్ఖుడిని కాదనని తావ్డే మీడియా సమావేశంలో అన్నారు. ఈ వివాదానికి సంబంధించి పోలీసులు మంగళవారం తావ్డే, బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్ తదితరులపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. తావ్డేపై ఎన్నికల సంఘం మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది.
తాజావార్తలు
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
-
BGauss C12 MaxR: 178KM రేంజ్తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..