Priyanka Gandhi: ప్రియాంక అరంగేట్రం అదిరింది.. లోక్సభలో అడుగుపెట్టేదెప్పుడంటే..!
- ప్రియాంకాగాంధీ రాజకీయ అరంగేట్రం అదిరింది
- వయనాడ్ లోక్సభ ఉపఎన్నికలో భారీ విజయం
- 4,08,036 ఓట్ల మెజార్టీతో ప్రియాంక గెలుపు
- సోమవారమే లోక్సభలోకి అడుగుపెట్టే ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్గాంధీ సోదరి, కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ రాజకీయ అరంగేట్రం అదిరిపోయింది. తొలి ప్రయత్నంలోనే సూపర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వయనాడ్ లోక్సభ ఉపఎన్నికల్లో పోటీ చేయకముందు.. కాంగ్రెస్ పక్షాన ప్రచారం మాత్రమే నిర్వహిస్తూ ఉండేవారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తూ ఉండేవారు. అన్ని వెనుకుండే నడిపించేవారు. అలాంటిది తొలిసారి వయనాడ్ లోక్సభ బైపోల్స్ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు. అంతే కనీవినీ ఎరుగని రీతిలో భారీ విక్టరీ అందుకున్నారు. తన సోదరుడు రాహుల్గాంధీ మీద ఉన్న 3.64 లక్షల మెజార్టీని దాటుకుంటూ 4 లక్షల మెజార్టీని క్రాస్ చేసి అత్యధిక విజయాన్ని సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్పై 4,08,036 ఓట్ల మెజార్టీతో ప్రియాంక విక్టరీ సాధించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: మహాయుతీ కూటమి చారిత్రాత్మక విజయానికి శుభాకాంక్షలు.. సీఎం ట్వీట్
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఇదిలా ఉంటే నవంబర్ 25 (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో సోమవారమే ప్రియాంక లోక్సభలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సోదరుడితో కలిసి లోక్సభలోకి ప్రవేశించి.. ఎంపీగా ప్రియాంక ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇక గాంధీ ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో ఉండడం విశేషం. తల్లి సోనియాగాంధీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక రాహుల్గాంధీ.. కంచుకోట అయిన రాయ్బరేలీ నుంచి ప్రతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక వయనాడ్ నుంచి విజయం సాధించి పార్లమెంట్లోకి అడుగుపెడుతున్నారు. మొత్తానికి తల్లి సోనియాతో పాటు ఇద్దరు పిల్లలు లోక్సభలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: BMW Price Hike: కార్ల ధరలను పెంచుతున్న బీఎండబ్ల్యూ.. ఎప్పటినుంచో తెలుసా?
లోక్సభ సాధారణ ఎన్నికల్లో రాహుల్గాంధీ రాయ్బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల నుంచి కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుని.. రాయ్బరేలీలో కొనసాగుతున్నారు. వయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకున్నప్పుడే.. ఆ స్థానంలో ప్రియాంక పోటీ చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. అన్నట్టుగానే ఆమె బరిలోకి దిగి తొలి అరంగేట్రంలో భారీ విక్టరీని అందుకున్నారు.
తాజావార్తలు
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఫార్ములా.. నలుగురికి ఎంత బియ్యం, ఎంత చికెన్ వాడాలో తెలుసా..?
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!