Priyanka Gandhi: ప్రియాంక అరంగేట్రం అదిరింది.. లోక్సభలో అడుగుపెట్టేదెప్పుడంటే..!
- ప్రియాంకాగాంధీ రాజకీయ అరంగేట్రం అదిరింది
- వయనాడ్ లోక్సభ ఉపఎన్నికలో భారీ విజయం
- 4,08,036 ఓట్ల మెజార్టీతో ప్రియాంక గెలుపు
- సోమవారమే లోక్సభలోకి అడుగుపెట్టే ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్గాంధీ సోదరి, కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ రాజకీయ అరంగేట్రం అదిరిపోయింది. తొలి ప్రయత్నంలోనే సూపర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వయనాడ్ లోక్సభ ఉపఎన్నికల్లో పోటీ చేయకముందు.. కాంగ్రెస్ పక్షాన ప్రచారం మాత్రమే నిర్వహిస్తూ ఉండేవారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తూ ఉండేవారు. అన్ని వెనుకుండే నడిపించేవారు. అలాంటిది తొలిసారి వయనాడ్ లోక్సభ బైపోల్స్ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు. అంతే కనీవినీ ఎరుగని రీతిలో భారీ విక్టరీ అందుకున్నారు. తన సోదరుడు రాహుల్గాంధీ మీద ఉన్న 3.64 లక్షల మెజార్టీని దాటుకుంటూ 4 లక్షల మెజార్టీని క్రాస్ చేసి అత్యధిక విజయాన్ని సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్పై 4,08,036 ఓట్ల మెజార్టీతో ప్రియాంక విక్టరీ సాధించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: మహాయుతీ కూటమి చారిత్రాత్మక విజయానికి శుభాకాంక్షలు.. సీఎం ట్వీట్
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే నవంబర్ 25 (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో సోమవారమే ప్రియాంక లోక్సభలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సోదరుడితో కలిసి లోక్సభలోకి ప్రవేశించి.. ఎంపీగా ప్రియాంక ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇక గాంధీ ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో ఉండడం విశేషం. తల్లి సోనియాగాంధీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక రాహుల్గాంధీ.. కంచుకోట అయిన రాయ్బరేలీ నుంచి ప్రతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక వయనాడ్ నుంచి విజయం సాధించి పార్లమెంట్లోకి అడుగుపెడుతున్నారు. మొత్తానికి తల్లి సోనియాతో పాటు ఇద్దరు పిల్లలు లోక్సభలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: BMW Price Hike: కార్ల ధరలను పెంచుతున్న బీఎండబ్ల్యూ.. ఎప్పటినుంచో తెలుసా?
లోక్సభ సాధారణ ఎన్నికల్లో రాహుల్గాంధీ రాయ్బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల నుంచి కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుని.. రాయ్బరేలీలో కొనసాగుతున్నారు. వయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకున్నప్పుడే.. ఆ స్థానంలో ప్రియాంక పోటీ చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. అన్నట్టుగానే ఆమె బరిలోకి దిగి తొలి అరంగేట్రంలో భారీ విక్టరీని అందుకున్నారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!