Robert Vadra: ప్రియాంక గెలుపుపై భర్త రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే..!
- వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ గెలుపు
- భార్య గెలుపుపై స్పందించిన భర్త రాబర్ట్ వాద్రా
- వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన వాద్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 4 లక్షలకు పైగా మెజార్టీతో ఆమె గెలుపొందారు. తాజాగా ప్రియాంక విక్టరీపై భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ప్రియాంక కృషిని గుర్తించిన వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల సమస్యలను పార్లమెంట్లో వినిపించేందుకు ప్రియాంక శ్రమిస్తుందని తెలిపారు. ఇప్పటిదాకా ప్రియాంక పుస్తకాలు చదవడం, పిల్లల్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నారని.. దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో ఆమె ఎన్నికల బరిలోకి దిగారని తెలిపారు. అలాగే తాను కూడా ప్రజల కోసం శ్రమిస్తూనే ఉంటానన్నారు. అలాంటప్పుడు పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. అయినా నాకూ అలాంటి సమయం వస్తుందని.. ప్రజలు ఏం కోరుకుంటారో అదే జరుగుతుందని వాద్రా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Bihar By Election Results: బీహార్ ఉప ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన ఎన్డీఏ..
Also Read
- Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
మహారాష్ట్ర ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రజల తీర్పును గౌరవించాలని.. గెలిచిన పార్టీతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఇక జార్ఖండ్ ఫలితాలపై సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి అధికార పార్టీకి బీజేపీ ఇబ్బందులు కలిగించిందని ఆరోపించారు. అయినా ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని రాబర్ట్ వాద్రా అన్నారు. జార్ఖండ్లో ఇండియా కూటమి భారీ విజయం సాధించింది. ఇక మహారాష్ట్రలో మహాయుతి కూటమి(ఎన్డీఏ) గెలుపొందింది.
ఇది కూడా చదవండి: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో టీమిండియా
ప్రియాంక వయనాడ్ లోక్సభ బైపోల్స్లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ విక్టరీ అందుకున్నారు. తన సోదరుడు రాహుల్గాంధీ మీద ఉన్న 3.64 లక్షల మెజార్టీని దాటుకుంటూ 4 లక్షల మెజార్టీని క్రాస్ చేసి అత్యధిక విజయాన్ని సొంతం చేసుకున్నారు. 4,08,036 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
తాజావార్తలు
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!