Congress Party: పీకే వ్యూహాలతో గుజరాత్ పై కాంగ్రెస్ నజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్పై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టిందా? అక్కడ జరిగే ఎన్నికల్లో గెలుపొందేందుకే ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో కాంగ్రెస్ ముందుకు వెళ్లనుందా? అందుకే రాహుల్తో రాజకీయ వ్యూహకర్త పీకే భేటీ అయ్యారా? ఇప్పుడంతా ఇదే టాపిక్ అవుతోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్… కాంగ్రెస్ పార్టీ కోసం రంగంలోకి దిగుతున్నారా? మోదీ ఇలాఖా గుజరాత్లో బీజేపీని గద్దె దించి… గాంధీల పార్టీని గెలిపిస్తారా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు పునరుజ్జీవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా? పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? అందుకే రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారా? ఇప్పుడిదే జాతీయ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగనున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది.
ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం మొదలుపెట్టింది. అధికారంలో ఉన్న పంజాబ్ను సైతం చేజార్చుకున్న కాంగ్రెస్.. మిగతా నాలుగు రాష్ట్రాల్లో పోటీలోనే లేనట్టుగా కనిపించింది. అలాగే దేశవ్యాప్తంగా పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు, పార్టీని కాపాడుకునేందుకు రాజకీయ వ్యూహకర్తలు కావాలని కాంగీయులు భావిస్తున్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అలాగే గుజరాత్లో కమలం పార్టీని ఓడించడానికి పీకే సేవలను తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్, ప్రియాంక గాంధీలతో పీకే చర్చలు జరిపారని సమాచారం.
Also Read
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
- love Or Attraction: లవ్లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
నిజానికి గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం… దశాబ్దాలుగా అందని ద్రాక్ష అన్న చందంగా మారింది. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అలాగే పార్టీకి దేశవ్యాప్తంగా పునరుత్తేజం తేవాలంటే.. మోదీ ఇలాఖాలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడమే సరైందని కాంగీయులు లెక్కలు కడుతున్నారు. ఇందులో భాగంగానే గుజరాత్పై హస్తం పార్టీ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్తో పీకే కలయిక వర్కవుట్ అవుతుందా? అని అంతా చర్చించుకుంటున్నారు.
గుజరాత్లో గెలవడం అనేది కాంగ్రెస్ (Congress party)కు అంత సులువైన పని కాదు. అందుకే ఇక్కడ పీకే రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కాంగ్రెస్పై విమర్శలు, రాహుల్పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన పీకే.. ఇప్పుడు వారితోనే కలిసి పనిచేయాలనే ఆలోచనలో ఉండటం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!