Rahul Gandhi: భారత్ జోడో యాత్ర సమయంలో ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు నిన్న (ఆగస్టు 4న) మందలించింది. రాహుల్పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవని, అతడు మాట్లాడిన మాటలు సరైనవేనంటూ ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.
దేశ భద్రతపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరని జస్టిస్ దీపాంకర్దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది.
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ఇండియా కూటమి నేతలకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఆగస్టు 7న విపక్ష సభ్యులకు డిన్నర్ పార్టీ ఇస్తున్నారు.
Rahul Gandhi: భారత సైన్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందరకు కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసుల దాఖలైంది. అయితే, ఈ కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Rajnath Singh: ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా ‘‘ఓట్ల దొంగతనానికి సంబంధించిన సాక్ష్యాల అణుబాంబు’’ తన వద్ద ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల సంచనల వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యల్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం తీవ్రంగా విమర్శించారు. ఆ అణుబాంబును పేల్చాలని సవాల్ విసిరారు.
Rahul Gandhi: "వ్యవసాయ చట్టాలను" వ్యతిరేకించినందుకు దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ తనను బెదిరించాడని రాహుల్ గాంధీ అన్నారు. తనను బెదిరించడానికి బీజేపీ జైట్లీని తన వద్దకు పంపిందని శనివారం ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణల్ని బీజేపీ తిప్పికొట్టింది.ఆ సమయంలో అరుణ్ జైట్లీ బతికేలేరనే విషయాన్ని కాంగ్రెస్ నేత మరిచిపోయారని ఎద్దేవా చేసింది.
Rahul Gandhi: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సదస్సులో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో చీటింగ్ జరిగిందని ఆరోపించారు.
బీజేపీ, మోడీలను ఓడించడానికి మేం తక్కువ కాదు.. రానున్న ఎన్నికల్లో మోడీ, బీజేపీని ఓడిస్తామని తెలంగాణ CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోనియాను ప్రధాని చేయాలని అందరూ కోరినా.. మన్మోహన్ సింగ్ కు అవకాశం ఇచ్చారు.. రాష్ట్రపతి అవకాశం వచ్చినా ప్రణబ్ ముఖర్జీకి ఛాన్స్ ఇచ్చారు.. త్యాగాలకు మారు పేరు గాంధీ కుటుంబం.. ప్రధాని, కేంద్ర మంత్రి పదవులు రాహుల్ గాంధీ తీసుకోలేదు.
Rahul Gandhi Fire On EC: దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఇవాళ జరుగుతున్న కాంగ్రెస్ న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను రాజును కాదు, రాజా కావాలని కోరుకోను.. రాజు కాన్సెప్ట్ కు నేను వ్యతిరేకం అన్నారు.
దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, 15 సీట్లతో మోడీ ప్రధాని అయ్యారు.. ఆ 15 సీట్లు లేకుంటే ప్రధాని పదవి మోడీకి దక్కేది కాదన్నారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయట పెడుతాం..మా దగ్గర 100 శాతం ఆధారాలున్నాయి.. రఫేల్ డీల్ లో పీఎంవోతో పాటు NSA జోక్యం చేసుకున్నాయి.. దీనికి సంబంధించి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని రాహుల్ గాంధీ తెలియజేశారు.