Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Kishan Reddy Challenges Rahul Gandhi On Congress Promises

Kishan Reddy vs Rahul Gandhi: నేను దేనికైనా సిద్ధం.. రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి ఛాలెంజ్!

Published Date :August 7, 2025 , 10:12 am
By Sampath Kumar
  • రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి ఛాలెంజ్
  • కాంగ్రెస్ గెలిస్తే నేను దేనికైనా సిద్ధం
  • తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాశారు
  • ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు
Kishan Reddy vs Rahul Gandhi: నేను దేనికైనా సిద్ధం.. రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి ఛాలెంజ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kishan Reddy throws a bold challenge to Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి కేంద్ర మంత్రి కిష‌న్‌ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా మరలా గెలిస్తే.. తాను దేనికైనా సిద్ధం అని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే.. రాహుల్ ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధం అని చెప్పారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో తిరిగి వచ్చే అవకాశం లేదని, అడ్డంగా ఓడిపోవడం ఖాయం అని అన్నారు. సూర్యుడిపై ఉమ్మినట్లు.. ప్రధాని నరేంద్ర మోడీ గారిని కాంగ్రెస్ విమర్శిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాశారు అని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద కాంగ్రెస్ పోరుబాట ధర్నాపై కిషన్ రెడ్డి స్పందించారు.

‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రాకముందు నుంచే అబద్ధాలు చెప్పింది. అమలు కానీ హామిల్చింది. ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల పేరుతో ఆశ చూపించి ప్రజలను మోసం చేసింది. చేతకాని తనంతో చేతులు ఎత్తేసి.. ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. తమ నిస్సహాయతను బీజేపీ, కేంద్రం, మోడీపై నెడుతున్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలకు రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు కూడా పూర్తి బాధ్యత వహించాలి. ఎన్నో డిక్లరేషన్‌ల పేరుతో ఆయా వర్గాలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక, ఏ డిక్లరేషన్‌ను డెడికేషన్‌తో అమలు చెయ్యడం లేదు. బీసీలకు లక్ష కోట్లు ఇస్తాం అన్నారు.. ఎందుకు ఇవ్వలేదు. డిల్లీ బాట పట్టి స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. డిల్లీ ప్రదక్షణ తప్ప.. తెలంగాణకు రేవంత్ చేసిందేమీ లేదు’ అని కేంద్ర మంత్రి కిష‌న్‌ రెడ్డి విమర్శించారు.

Also Read: Sourav Ganguly: మరోసారి సౌరవ్ గంగూలీ పోటీ.. ఈసారి కూడా ఏకగ్రీవమేనా!

‘బీసీలకు ఇచ్చిన హామీల్లో ఏ హామీ కూడా అమలు చెయ్యడం లేదు. అద్దాల మేడలో కూర్చుని.. ఇతరుల మీద రాళ్ళు రువ్వే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకు సామాజిక సాధికారత కల్పించే ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు. నిన్నటి ధర్నాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను పొగడటం, మోదీని విమర్శించడానికే సరిపోయింది. రేవంత్ రెడ్డి ఎడాపెడా మాట్లాడేందుకు రేవంత్ ధర్నా. ధర్నాకు కాంగ్రెస్ పెద్దలు ఎందుకు రాలేదు. న్యాయబద్దంగా, చట్టబద్దంగా, నిపుణులతో మాట్లాడి బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చెయ్యాలి. రేవంత్ రెడ్డి పాలనలో వైఫల్యం, రాజకీయంలో వైఫల్యం, హామీలు అమలు చెయ్యడంలో వైఫల్యం.. అవినీతిలో మాత్రం సక్సెస్ అయ్యారు. గత ప్రభుత్వ కేసీఆర్‌తో అవినీతిలో పోటీ పడుతున్నారు. అవినీతి, అప్పుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. మజ్లిస్ పార్టీ కనుసైగలో ముస్లింలకు కేసీఆర్ రిజర్వేషన్లు ఇచ్చాడు. ఇపుడు రేవంత్, కాంగ్రెస్ కూడా 34 నుంచి 32కు కుదించే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ జనాభా ప్రాతిపదికన 42 శాతం ఇవ్వడం లేదు. కులగణనలో తప్పులు చేశారు’ అని కిష‌న్‌ రెడ్డి మండిపడ్డారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Kishan Reddy
  • Kishan Reddy challenge
  • Kishan Reddy Vs Rahul Gandhi
  • rahul gandhi

తాజావార్తలు

  • Donald Trump: ‘‘ఈ రోజు ఇంకా గట్టిగా కొడుతాం’’.. ఇరాన్ క్షమాపణలపై ట్రంప్ స్పందన..

  • ViralVideo: ఛీఛీ చదువు చెప్పాల్సిన గురువే.. వీడియో వైరల్!

  • Testosterone: పురుషుల ఆరోగ్య సీక్రెట్.. టెస్టోస్టిరాన్ పెంచే బెస్ట్ ఆహారాలు ఇవే!

  • Ustaad Bhagat Singh: ఉగాదికి ‘ఉస్తాద్’ ఊచకోత.. డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్!

  • CM Revanth Reddy: 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions