Gyanesh kumar vs INDIA Bloc: ముదురుతున్న ఓట్ల చోరీ వివాదం.. సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు ప్లాన్
- ముదురుతున్న ఓట్ల చోరీ వివాదం
- సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు ఇండియా కూటమి ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఓట్ల చోరీ వివాదం ముదురుతోంది. ఎన్నికల సంఘం-ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని ఆధారాలను కూడా రాహుల్గాంధీ చూపించారు. దీనికి కౌంటర్గా ఆదివారం ఎన్నికల సంఘం ప్రెస్మీట్ నిర్వహించింది. సీఈసీ జ్ఞానేష్కుమార్ మాట్లాడుతూ.. ఓట్ల చోరీపై ఆధారాలు చూపించాలని.. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇలా..!
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
తాజాగా సీఈసీ జ్ఞానేష్కుమార్పై అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఈసీని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం ఉంటుుంది. కానీ ప్రతిపక్షాలకు పార్లమెంట్లో అంత బలం లేదు. ఈ నేపథ్యంలో అభిశంసన తీర్మానం పెడతారా? లేదా? అని తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: UP: మీరట్లో దారుణం.. జవాన్ను స్తంభానికి కట్టేసి చావబాదిన టోల్ సిబ్బంది
ఇదిలా ఉంటే ఈసీకి వ్యతిరేకంగా రాహుల్గాంధీ బీహార్లో యాత్ర చేపట్టారు. 16 రోజుల పాటు ఓటరు అధికార్ యాత్ర పేరుతో యాత్ర చేపట్టారు. తేజస్వి యాదవ్తో కలిసి రాష్ట్రంలో యాత్ర చేస్తున్నారు. బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఓట్లు దొంగిలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. త్వరలోనే బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో దాడి తీవ్రతరం చేశారు. దేశమంతా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓట్లు దొంగతనం జరుగుతుందని స్వరం పెంచారు.
బీహార్లో అక్టోబర్ లేదా నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ చేస్తున్నాయి. అయితే ప్రజలు ఈసారి ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో చూడాలి.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!