Priyanka Gandhi: భారతీయుడెవరో నిర్ణయించేది మీరు కాదు.. న్యాయమూర్తుల తీరుపై ప్రియాంకాగాంధీ అసహనం
- భారతీయుడెవరో నిర్ణయించేది మీరు కాదు
- న్యాయమూర్తుల తీరుపై ప్రియాంకాగాంధీ అసహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ భద్రతపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరని జస్టిస్ దీపాంకర్దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: Amit Shah: అమిత్ షా సరికొత్త రికార్డ్.. దేశ చరిత్రలో ఆయనకే సొంతం
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
రాహుల్గాంధీ వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు మందలించడంపై వయనాడ్ ఎంపీ, రాహుల్గాంధీ సోదరి ప్రియాంకాగాంధీ స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుడి విధి అని గుర్తుచేశారు. అయినా నిజమైన భారతీయుడు ఎవరో నిర్ణయించేది మీరు కాదని.. గౌరవనీయులైన న్యాయమూర్తులు.. దేశ ప్రతిపక్ష నేతకు తగిన గౌరవం ఇవ్వాలన్న విషయం గుర్తించుకోవాలని పేర్కొన్నారు. అయినా తన సోదరుడు ఎప్పుడూ సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని.. వారిని అత్యున్నతంగా గౌరవిస్తారని తెలిపారు. అలాంటిది తన సోదరుడి గురించి ధర్మాసనం వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు తప్పుడు వివరణగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mayasabha: “మయసభ”లో పరిటాల రవి పాత్ర ఉంటుందా?
భారతదేశంలో 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని డిసెంబర్ 16, 2022న భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం ఈ వ్యాఖ్యల్ని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు? విశ్వసనీయ సమాచారం ఏంటి? మీరు నిజమైన భారతీయులైతే.. మీరు ఇలా మాట్లాడరు. సరిహద్దుల్లో వివాదం ఉన్నప్పుడు.. ఇదంతా ఎందుకు? అని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్నే ప్రియాంకాగాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. న్యాయమూర్తులు తగిన గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!