Rahul Gandhi: ఈసీపై రాహుల్గాంధీ యుద్ధం.. బెంగళూరులో ధర్నా
- ఈసీపై రాహుల్గాంధీ యుద్ధం
- బెంగళూరులో ధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఎలక్షన్ కమిషన్పై లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ యుద్ధం ప్రకటించారు. అధికార పార్టీ-ఎన్నికల కమిషన్ ఓట్ల కుట్రకు పాల్పడుతున్నారని గురువారం ఇండియా కూటమి సమావేశంలో ఆరోపించారు. తాజాగా ఇదే అంశంపై బెంగళూరులో ధర్నా చేపట్టారు. మరోసారి ఈసీ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi-EC: రాహుల్గాంధీ ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ.. డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఓట్ల అవకతవకలతోనే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. మేం ప్రశ్నిస్తుంటే ఈసీ వెబ్ సైట్ మూసివేసిందన్నారు. మహారాష్ట్రలో కోటి కొత్త ఓటర్లు నమోదయ్యాయని.. కర్ణాటకలో కూడా ఫేక్ ఓట్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఒకే ఇంట్లో 40కి పైగా ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ వివరించారు. ఇదంతా ఓటర్లను మోసం చేయడానికి భారతీయ జనతా పార్టీతో ఎన్నికల సంఘం కుట్ర పన్నిందని ఆరోపించారు. రాజ్యాంగంపై దాడి చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Gaza-Israel: ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. గాజా స్వాధీనానికి కేబినెట్ పచ్చజెండా
బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఓటు దొంగతనం జరుగుతుందని హెచ్చరించారు. ‘‘రాజ్యాంగంపై దాడి చేసి తప్పించుకోగలమని మీరు అనుకుంటే… మీరు మరోసారి ఆలోచించాలి. మేము మిమ్మల్ని ఒక్కొక్కరిగా పట్టుకుంటాము. దీనికి సమయం పడుతుంది. కానీ మేము మిమ్మల్ని పట్టుకుంటాము’’ అని ఈసీకి వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే రాహుల్గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్ చేసిన ఆరోపణలు అసంబద్ధ విశ్లేషణగా పేర్కొంది. తప్పుదోవ పట్టించే వివరణలు వ్యాప్తి చేసినందుకు ఫిర్యాదు సమర్పించాలని.. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని ఎన్నికల కమిషన్ డిమాండ్ చేసింది. రాహుల్గాంధీ విశ్వసిస్తే.. డిక్లరేషన్పై సంతకం చేసి ఇవ్వాలని కోరింది. ఒక వేళ డిక్లరేషన్పై సంతకం చేయకపోతే విశ్లేషణ, తీర్మానాలు అసంబద్ధమైనవిగా పరిగణించాల్సి వస్తుందని తెలిపింది. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించడానికి గురువారం సాయంత్రం రాహుల్ గాంధీ ఇండియా కూటమికి విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఓటర్ల మోసం గురించి ఆరోపణలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ విభాగంలో భారీ ఓటర్ల మోసం బయటపడిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇక రాహుల్ ఆరోపణలను బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది. ఆరోపణలు నిజమైతే అందుకు సంబంధించిన వివరాలతో కూడిన డిక్లరేషన్ను సమర్పించాలని కోరింది. రాహుల్ వాటిని సమర్పించడంలో విఫలమైతే.. అవాస్తవాలని స్పష్టమవుతుందని చెప్పింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!